
MNS కార్యకర్తలు దుకాణదారుడిపై దాడి చేసిన వివాదం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం తన ప్రసంగాన్ని “జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్” ఈ నినాదంతో ముగించారు. షిండే చేసిన జై గుజరాత్ నినాదంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్కు చెందినవారు కాబట్టి షిండే ఈ నినాదం పలికారని, ఆయనకు “అధికార దాహం” ఉందనంటూ ఎన్సిపి (ఎస్పీ) నాయకుడు క్లైడ్ క్రాస్టో ఆరోపించారు.