నాయకత్వం మార్పుపై ఊహాగానాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో సారి తోసిపుచ్చారు. ఐదేళ్ల పాటు పూర్తి పదవికాలం తాను సిఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. మీకు ఏమైనా సందేహం ఉందా అని మీడియాను నిలదీశారు. కాగా, తనకు మరో గత్యంతరం లేదని, తాను ఆయనకు మద్దతు ఇవ్వాలని, హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అన్నారు. కర్ణాటకలో నాయకత్వం మారబోవడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా ప్రకటన వెలువడడం విశేషం.

