విశాఖ స్టీల్ప్లాంట్ ఉత్పత్తిలో మరో కీలక అడుగు పడింది. స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-3ని ఎట్టకేలకు పునఃప్రారంభించారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబరులో మూతపడిన బీఎఫ్-3ను మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకు ఏడు వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లాస్ ఫర్నేస్-3పై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు మంచిరోజులొస్తాయని భావిస్తున్నారు.

