
ఏపీ ప్రభుత్వం విజయవాడలో టూరిజం కాన్క్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ లు పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు బాబా రామ్దేవ్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు. ఏపీలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని బాబా రాందేవ్ను కోరారు.