
జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఇంజినీర్ మనీషా ఆ బిల్లులను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసింది. మరో రూ.15,000 ఇవ్వాలని మనీషా డిమాండ్ చేయడంతో ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. లంచం తీసుకుంటున్న సమయంలోనే మనీషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మనీషాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.