
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న వేళ, రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల రైతులకు ఈ పథకాన్ని రద్దు చేసింది. ఆకుకూరలు, కూరగాయలు పండించేవారికీ భరోసా నిధులు రద్దు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం ఉండటంతో ఆకుకూరలు సాగు చేస్తున్నామని, తమకు కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం రైతులకు మద్దతు తెలుపుతున్నాయి