
యూపీఐ చెల్లింపు జూన్ 16న మరింత వేగంగా సాగాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త ఆదేశాలతో వేగవంతమైన చెల్లింపులు సాధ్యమయ్యాయని, గతంలో యూపీఐ చెల్లింపులకు గరిష్ట సమయం 30 సెకన్లుగా ఉంటే ఎన్పీసీఐ దాన్ని 15 సెకన్లకు తగ్గించింది. ఈ తగ్గింపు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని యూపీఐ ప్లాట్ఫారమ్లతో సహా యోనో ఎస్బీఐ, ఐమొబైల్ పే, ఇతర బ్యాంకింగ్ యాప్లకు వర్తిస్తుంది.