
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్సిబీ జట్టుతోపాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA), విక్టరీ పరేడ్.. విజయోత్సవ వేడుకను నిర్వహించిన DNA నెట్వర్క్స్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.