మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ నోటీసులు వ్యతిరేకిస్తూ.. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహాధర్నా చేపట్టనున్నట్లు నిర్వహించనున్నట్లు కవిత తెలిపింది.

