
ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ఉద్యోగులకు నూతన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, 1/2019 సర్క్యూలర్ను తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 1/2019 సర్క్యూలర్ను రద్దు చేయడంతో, చిన్నపాటి తప్పిదాలకే ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ ఉద్యోగులపై గట్టిగా శిక్షలు విధించడం ప్రారంభించింది. దీని వల్ల పలువురు ఉద్యోగులు అన్యాయంగా బాధపడినట్లు న్యాయపోరాట సంఘం (NMU) నేతలు పేర్కొన్నారు.