
5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉండేవి. ఇవన్నీ అపోహలేనని, 5జీ తరంగాలతో మానవులకు ఎలాంటి హానీ లేదని, జర్మనీకి చెందిన కన్స్ట్రక్టర్ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యింది. మానవ చర్మ కణాలను అత్యంత శక్తివంతమైన 5జీ తరంగాల తాకిడికి గురిచేయగా, మానవుల్లో జన్యు వ్యక్తీకరణ, మిథైలేషన్ ప్రొఫైల్లో ఎలాంటి మార్పులు రాలేదని సైంటిస్టులు గుర్తించారు.