
కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.