శ్రీలంక పలకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పథుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించేలా చేశాడు. ఈ విజయం ద్వారా శ్రీలంక జట్టు సూపర్ ఎయిట్స్కు కూడా అర్హత సాధించింది. 2026 T20 వరల్డ్ కప్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా నిస్సంక నిలిచాడు.

