
మంగళవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా.. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే కేరళ ఎక్కువ కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే ఢిల్లీలోనూ గణనీయంగా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహల్ తెలిపారు. కాకపోతే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.