
ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మాది పేదల కోసం పని చేసే ప్రభుత్వమని, పేదలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామని 64 లక్షల మందికి ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, ఏ రాష్ట్రంలోనూ ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదని తెలియజేశారు. ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని, 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని చంద్రబాబు నాయుడు సూచించారు.