మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురిని కాపాడిన హీరో పోలీస్ అధికారి ఆ రాష్ట్ర పోలీస్ బాస్ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ (Sadanand Date)ను మహారాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. జనవరి 3న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ రష్మి శుక్లా స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు.

