loader

5 సిక్సులు, 10 ఫోర్లు.. సెంచరీతో ఆసీస్ తాట తీసిన నిస్సంక.. తొలి ప్లేయర్ గా రికార్డ్

శ్రీలంక పలకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పథుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించేలా చేశాడు. ఈ విజయం ద్వారా శ్రీలంక జట్టు సూపర్ ఎయిట్స్‌కు కూడా అర్హత సాధించింది. 2026 T20 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా నిస్సంక నిలిచాడు.

దేశం పరువు తీశారు.. పాక్ జట్టుపై మాజీలు ఫైర్

భారత్‌తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, జావేద్ మియాందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును తీశారని ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, షహీన్ […]

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్, కొత్త ఇన్‌ఛార్జులు!

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాల్లో ఎన్నికల పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు. తొర్రూర్:  మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, జనగామ:  బండ ప్రకాశ్,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి,  కాగజ్‌నగర్:  జోగు రామన్న జహీరాబాద్: చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం:  సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్ […]

భుజం సర్జరీపై చిరంజీవి అప్‌ డేట్‌

తాజాగా చేతికి గాయంతో కనిపించారు చిరంజీవి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు. చిన్న భుజానికి కీ హోల్‌ సర్జరీ జరిగిందని, ఇప్పుడు బాగానే ఉన్నట్టు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నానని, తిరిగి రెగ్యూలర్‌ దిన చర్యకి వస్తున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన నితిన్‌ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చిరు. ఈ విషయంలో ఆందోళన చెందుతూ, తనపై ప్రేమని వ్యక్తం చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు […]

ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎంతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమస్యలపై తుమ్మల చర్చించారు. 5 గ్రామపంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్‌ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. జగ్గయ్యపేట నేషనల్‌ హైవే పనుల వేగవంతంపై చొరవ చూపాలని మంత్రి తుమ్మల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు టీటీడీలో తెలంగాణకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు.

ప్రపంచ స్థాయి ఎఐ సదస్సు ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం ప్రపంచ స్థాయి ఎఐ సదస్సుకు కనులపండువైన వేదిక అయింది. సోమవారం ఆరంభం రోజే లోనికి ప్రవేశించడానికి భారీ స్థాయిలో క్యూలైన్లు వెలిశాయి. పలు దేశాలకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల అధినేతలు, ఎఐ రంగ నిపుణులు , విధాన నిర్ణేతలు , ఎఐ సంస్థల వ్యవస్థాపకులు , సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ముందుకు వచ్చిన ఎఐ గురించి సరైన రీతిలో అవగావహనకు ఎక్కువగా యువతరం ఈ […]

JEE mains 2026 ఫలితాల విడుదల

జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన బీఈ, బీటెక్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. 13,04,653 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 96.26 శాతం మంది ఉత్తీర్ణణత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. కాగా ఈసారి పేపర్ 1లో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు. బాలికలు ఎవరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారు. […]

AI జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ సందర్శించిన మోదీ

ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.  డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ ‘ఏఐ ఫర్ ఆల్’ అనే ఆధునిక […]

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరంటే !!

కొత్తగూడెం(సీపీఐ)-మేయర్‌ మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్‌ సిరిపురపు లలితకుమారి, | కరీంనగర్ కార్పొరేషన్ (బీజేపీ)-మేయర్ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్ రావు  | నిజామాబాద్ కార్పొరేషన్ (కాంగ్రెస్)- కూరగాయల ఉమారాణి,డిప్యూటి మేయర్ సల్మా తహసీన్‌, | మహబూబ్‌నగర్ కార్పొరేషన్ (కాంగ్రెస్)-మేయర్‌ మమత శ్రీనివాస్,డిప్యూటీ మేయర్‌గా సురేందర్ రెడ్డి, | రామగుండం కార్పొరేషన్ (కాంగ్రెస్)-మేయర్‌ మహంకాళి స్వామి,డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, | నల్గొండ కార్పొరేషన్ (కాంగ్రెస్)-మేయర్‌ బుర్రి చైతన్య రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా అష్రాఫ్‌ అలీ, | […]

హంపిలో విదేశీ మహిళపై అత్యాచారం.. ముగ్గురికి మరణ శిక్ష

విదేశీ మహిళపై అత్యాచారం కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి సమీపంలో గతేడాది మార్చి 6న జరిగిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం, అమెరికన్ పర్యాటకుడి హత్య కేసులో ముగ్గురు దోషులకు కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON