loader

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

“బాబుగారి అండతో మోదీ ప్రధాని అయినా.. రాష్ట్రానికి గుండు సున్నా”

2026-27 కేంద్ర బడ్జెట్ మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. “ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు గారి అండతో ప్రధానిగా నిలబడిన మోదీ.. ప్రతి సారి బడ్జెట్లో మనకు చేస్తున్నది ఘరానా మోసమే. 50 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే. ఇంత జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపటం లేదని విమర్శించారు.

సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదు.. ప్రతి ప్రశ్నకు కేసీఆర్ కుండ బద్ధలు కొట్టినట్టు బదులిచ్చారు ..!

బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్‌ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగించినట్టుగా సిట్ ప్రశ్నలు వేస్తోందని మండిపడిన ఆయన.. ప్రతి పశ్నకు కుండబద్ధలు కొట్టినట్టు కేసీఆర్ బదులిచ్చాని వెల్లడించారు. సిట్ విచారణ ఎర్రవల్లిలోనే జరిపే విషయంపై కోర్టుకు వెళ్తే తమకు అనుకులూంగా తీర్పు వచ్చేదని.. కానీ తాము అలా చేయలేదని కేటీఆర్ చెప్పారు.

సిట్‌ విచారణను లైట్ తీసుకున్న కేసీఆర్!

రాత్రి ఏడున్నరకు విచారణ పూర్తి అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నంది నగర్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. చాలా యాక్టివ్‌గా కనిపించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నిలపై చర్చించారు. సిట్‌ విచారణపై  మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరిగింది.  ఆయన మాత్రం దీనిపై ఎలాంటి  ప్రకటన చేయలేదు. సిట్ విచారణ  తీరుపై లాయర్లు, కేటీఆర్, […]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి పేర్కొంది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. ఈ కేసులోనే చంద్రబాబు ను అరెస్టు చేసి […]

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌లో జనవరి నెలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెలలో కొనుగోళ్ల చెల్లింపుల లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారా జరగడంతో వీటి సంఖ్య, విలువ భారీగా పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్,కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తెలిపింది. జనవరిలో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా రికార్డు స్థాయిలో రూ.28.33 లక్షల కోట్లు లావాదేవీలు నమోదయ్యాయి.

‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’

చంద్రబాబు సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ లు ఎన్ఎబీ, ఎన్టీఆర్ నిర్ధారణ చేశాయి. మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ” అంటూ ఎక్స్ […]

ఇదో గుడ్డి బడ్జెట్: రాహుల్ గాంధీ

భారతదేశ వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని గుడ్డి బడ్జెట్ ఇది. యువతకు ఒకపక్క ఉద్యోగాలు లేవు, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇంటి పొదుపు తగ్గింది. రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఆయా రంగాల దిద్దుబాటును తిరస్కరించే బడ్జెట్ ఇది. వాటి గురించి ప్రస్తావనే లేదు. వాస్తవ సమస్యలను పక్కదారి పట్టించారు.

అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్‌ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ […]

కెసిఆర్ తెలంగాణ జాతిపిత కాదు: ఎంపి చామల

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ మఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమంటున్నారని ఫోన్ ట్యాటింగ్ ఆధారాలు లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల హక్కులు హరించబడ్డాయని ఆయన ఆందోళన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON