loader

కాలుష్య తీవ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన

విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్​-1 అభ్యర్థులకు అలర్ట్ – తుది ఎంపిక జాబితా విడుదల

గ్రూప్‌-1 తుది ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 87 గ్రూప్‌- 1 ఉద్యోగాల నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి హాల్‌టికెట్‌ నంబర్లతో కూడిన జాబితాతో పాటు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇతర వివరాలను అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రిజర్వేషన్‌ రోస్టర్‌ కేసులో స్టే లేకపోవడం, న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు అనుమతించడంతో ఈ ఫలితాలను అధికారులు ప్రకటించారు. […]

జనసంద్రంగా మారిన మేడారం – వనదేవతలను దర్శించుకుని భక్తుల పారవశ్యం

మేడారంలో కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం లక్షలాదిగా తరలివస్తూనే ఉన్నారు. నిండు జాతరలో తల్లులను చూసి తన్మయత్వం పొందుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పునకు నిలువెత్తు బంగారం సమర్పించి సంతోషంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం సమ్మక్క- సారక్క అమ్మవార్లు వన ప్రవేశంతో మేడారం జాతర పరిమాసప్తం కానుంది. సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ఆదివాసీల ఇష్టదైవాన్ని నిండు మనసుతో కొలిచారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క గద్దె మీదకు రావటంతో ఈరోజు భారీగా రద్దీ పెరిగింది.

శబరిమల బంగారం చోరీ కేసు.. నటుడు జయరామ్‌పై విచారణ

శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ శుక్రవారం విచారించింది. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవలనే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా అని సిట్ ఆరా తీసినట్టు సమాచారం. శుక్రవారం చెన్నై లోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

మోదీ పాలనలో ప్రశ్నిస్తే నేరమా?..అశ్వమిత్‌పై వేధింపులకు అర్ధమేంటో ప్రధాని చెప్పాలి?

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే యువ గొంతులను అణిచివేసే ప్రమాదకర ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి తీవ్రంగా విమర్శించారు. “నేటి భారతదేశంలో ప్రశ్నించడం నేరంగా మారుతోంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం కప్పి ఉంచబడుతున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ లక్నోకు చెందిన 14 ఏళ్ల యువ కార్యకర్త అశ్వమిత్ గౌతమ్‌పై కొనసాగుతున్న వేధింపులను ఖండించిన డా. రేఖ.. ఆ యువకుడు ఎవరిని దుర్భాషలాడలేదని, హింసకు […]

బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త సీజే రాయ్ ఆత్మహత్య

ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ సి.జె. రాయ్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన పారిశ్రామిక వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సి.జె. రాయ్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు, జనవరి 27న ఆయన నివాసం , కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. .సి.జె. రాయ్ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ , కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో చెరగని ముద్ర […]

పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని అభ్యర్థిస్తూ కౌశిక్ […]

ఏపీలో భారీ ఆపరేషన్.. అలుగును విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్

నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అలుగును (Pangolin) విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాపూరు – తెగచర్ల అటవీ ప్రాంతంలో ఈ అలుగును పట్టుకున్నట్లు నిందితులు ప్రాథమిక విచారణలో అంగీకరించారు. దీని చర్మంపై ఉండే పొలుసులు (Scales) మందుల తయారీలో వాడతారనే ప్రచారంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా […]

పగ్గాలు చేపట్టనున్న సునేత్ర పవార్- శనివారమే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం?

మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్​సీపీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఎన్​సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆమెను తమ నేతగా ఎన్నుకోనున్నట్లు మంత్రి ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. శనివారమే ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా తమకు అభ్యంతరం లేదని సీఎం దేవేంద్ర ఫడణవీస్​ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON