loader

గూగుల్ ఇంటర్న్‌షిప్‌..యువత కోసం గోల్డెన్ ఛాన్స్

ప్రపంచనేపథ్యలో టెక్ దిగ్గజంగా గుర్తింపు పొందిన గూగుల్ 2026 కోసం వివిధ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్ తో పాటు, బెంగళూరు, పూణే, హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీసుల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కూడా లభిస్తుంది. దరఖాస్తు చివరి తేది మార్చి 31, 2026 https://www.google.com/about/careers/applications/

ఉజ్జయినిలో చెలరేగిన హింస…. బస్సులకు నిప్పు.. ఇళ్లపై రాళ్లదాడి..!

మధ్యప్రదేశ్‌ లోని అధ్మాత్మిక నగరం ఉజ్జయినిలో భారీ హింస చెలరేగింది. గురువారం రాత్రి వీహెచ్‌పీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడితో చెలరేగిన అల్లర్లు రెండో రోజు కూడా కొనసాగాయి. అల్లరి మూకలు పలు బస్సులకు నిప్పుపెట్టాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన తరువాత పోలీసులు ఉజ్జయినిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్ట్‌ చేశారు. ఉజ్జయిని బస్టాండ్‌లో దూరిన అల్లరమూకలు విధ్వంసం సృష్టించాయి. 15 బస్సులను […]

మేడారం జాతరకు 3 కోట్ల 70 లక్షల కేంద్ర నిధులు

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిచొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని విడుదల చేశాయి.కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో మేడారం చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్కూట్ పేరిట గతంలో పలు అభివృద్ధి పనులను కూడా […]

‘స్టాలిన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభం’ తమిళనాడులో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు!

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దుష్ప్రవర్తన నుంచి తమిళనాడు విముక్తి కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 23, 2026) తమిళనాడు ప్రభుత్వంపై దాడి చేశారు. DMK అనేక వాగ్దానాలు చేసింది కానీ ఫలితాలు శూన్యం అని అన్నారు. ఆయన DMK ప్రభుత్వాన్ని CMC అని పిలిచారు . అంటే కరప్షన్ మాఫియా క్రైమ్‌ను ప్రోత్సహించే ప్రభుత్వం అని అర్థమని వివరించారు. తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరోసారి గడువు పొడిగింపు

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)–2025 కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 23 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు రూ.10,000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

కల్తీమద్యం కేసులో కీలక పరిణామం: జైలు నుంచి విడుదలైన మాజీమంత్రి జోగి రమేశ్‌

ఏపీలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్‌పై విడుదల అయ్యారు. కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైలులో ఉన్న మజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్‌పై విడుదల అయ్యారు.జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఖైదీగా తనను జైలులో ఇబ్బందులు పెట్టారని, తనను అరెస్ట్ చేయించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాక్షసానందం […]

మెడికల్ సీటు కోసం.. దివ్యాంగుల కోటా కోసం కాలు నరికేసుకున్న నీట్ అభ్యర్థి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల యువకుడు మెడికల్ సీటు కోసం తన కాలును తానే నరుక్కోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నీట్ పరీక్షలో రెండుసార్లు విఫలమవ్వడంతో.. దివ్యాంగుల కోటాలో సీటు దక్కించుకోవచ్చని భావించిన సూరజ్ భాస్కర్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత దుండగులు దాడి చేశారని నాటకమాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఎంబీబీఎస్ కల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.

సీఎం బావమరిదే కింగ్ పిన్.. ఆధారాలున్నా చర్యలెందుకు లేవు.. రేవంత్ కు కేటీఆర్ ప్రశ్న

సింగరేణి టెండర్ల దొంగలపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చినా.. చర్యలు ఎందుకు లేవు..? స్వయంగా మంత్రి కుమారుడు గూండాగిరి చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. సీఎం బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు లేదు. మమ్మల్ని విచారించడంపై లీకులు మీడియాకు ఇస్తారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేరకంగా ఉండాలి. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మళ్లీ పిలుస్తామన్నారు – లీకులకు బాధ్యులెవరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

‘రెండేళ్ల అసమర్ధ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారు. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను అడిగాను. సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్లు తెలుసా అని అడిగారు. అడిగిందే అడిగారు. తిప్పితిప్పి అడిగి చిరాకు పెట్టారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు.. మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని ప్రశ్నించా. మేం అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు.

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది: సీఎం మమత

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారామె.  కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బీఆర్ ఆంబేడ్కర్ వంటి జాతీయ ప్రముఖులను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అవమానించాయని ఆమె వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON