గౌతమి మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ లక్ష్యాన్ని గుజరాత్ ఛేదించేనా..!
డబ్ల్యూపీఎల్లో అజేయంగా దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వడదోరలోనూ భారీ స్కోర్ చేసింది. అలాఅనీ ఈసారి ఓపెర్లు దంచేయలేదు. అయినా సరే ఆ జట్టు 178 పరుగులు చేసిందంటే గౌతమి నాయక్(73) చలవే. పవర్ఫుల్ షాట్లతో అలరించిన గౌతమి.. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడి భారీ స్కోర్కు బాటలు వేసింది. ఆఖర్లో రీచా ఘోష్(27), రాధా యాదవ్(17)ల విధ్వంసంతో గుజరాత్కు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ.

