loader

‘మహా’ పోల్స్ డే.. మరాఠీ కార్డుతో ఠాక్రేలు, అభివృద్ధి ఎజెండాతో ఫడ్నవిస్

మహారాష్ట్ర పురపోరు కు సర్వం సిద్ధమైంది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)   సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారంనాడు పోలింగ్ జరుగనుంది.   గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ కీలక ఎన్నికలను ప్రధాన   పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం సాగించాయి. మహాయుతి కూటమి   గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని చెబుతుండగా,    ఐక్యంగా బరిలోకి దిగిన ఠాక్రే సోదరులు సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం.. కీలక నిర్ణయం

 తమ పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అవసరమైతే దాడి చేస్తామంటూ  ఇరాన్ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతర్‌లోని అల్ ఉదైద్ అమెరికా వైమానిక స్థావరంలోని కొందరు అధికారులను  అగ్రరాజ్యం వెనక్కు రమ్మని పిలిచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. అమెరికా దాడులు మొదలైన పక్షంలో తామూ పొరుగు దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడి చేస్తామని తేల్చి చెప్పింది.

NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్

NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి.. అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు.  రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని […]

రాజ్‌కోట్ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

రాజ్‌కోట్‌లో భారత్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరిగిన 2వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌ను 1-1తో సమం చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్(131), విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు సాధించి జట్టు […]

సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో – హరీష్ రావు ఆగ్రహం

బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడటాన్ని తప్పుబడుతూ, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే ఖాకీ చొక్కా తీసేసి, కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ పై , ఒక అగ్ర నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ […]

చైనా మాంజాతో గొంతు తెగి యువకుడి మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవదేష్‌కుమార్ (38)సంగారెడ్డి రూరల్ ఫసల్‌వాదీలో గ్రాంలో పొలంలో కూలీ పనుల కోసం వచ్చి వరి నాట్లు వేసి కూరగాయల కోసం సంగారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా గాలిపటాలు ఎగురవేసే దారం ఎడకు తగిలి తీవ్ర రక్త స్రావం కాగా స్థానికులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడి కుమారుడు  పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చైనా మాంజాను స్వాధీనం చేసుకొని మృతదేహాన్నీ పోస్టుమార్టం కోసం  […]

పాలక్ పనీర్‌ను అవమానించిన అమెరికా ఇంటి యజమాని – రూ.2 కోట్లు కట్టించిన భారత విద్యార్థులు

భారతీయ విద్యార్థులు ఒక అపార్ట్‌మెంట్‌లో పాలక్ పనీర్ తయారు చేసుకుంటుండగా, ఆ అపార్ట్‌మెంట్ యజమాని ఆ విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వాసన పట్ల అసహ్యం ప్రకటించడమే కాకుండా, భారతీయ ఆహారపు అలవాట్లను కించపరుస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. వారిని బలవంతంగా బయటకు పంపడమే కాకుండా, వారి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు జాతీయత ఆధారంగా వారిని వివక్షకు గురిచేయడం నేరమని కోర్టు స్పష్టం చేసింది. 2 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని […]

‘సీఎం మార్పు’ అంశం కర్ణాటకలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలోని మండకల్లి నుండి దిల్లీకి తిరిగి వెళ్లేందుకు మండకల్లి విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో రాహుల్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనతో డిప్యూటీ సీఎం డీకే కాసేపు సంభాషించారు. విమానాశ్రయంలో రాహుల్, డీకే మాట్లాడుకున్న ఫొటోలు కర్ణాటక అధికార పక్షంలో సంచలనం సృష్టించాయి. ఇంతకీ వారు ఏం చర్చించారు ? డీకే ఏం అడిగారు? రాహుల్ ఏం చెప్పారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. […]

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదు

మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

లారెన్స్ గ్యాంగుతో భారత ప్రభుత్వానికి సంబంధాలు.. కెనడా తాజా ఆరోపణ

ఇండియాలో పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలున్నాయని కెనడా ఆరోపించింది. కెనడాలో ఇండియా ప్రభుత్వం తరఫున లారెన్స్ గ్యాంగ్ పని చేస్తోందని అక్కడి పోలీసు విభాగం ఆర్సీఎంపీ (రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్) వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయ్, అతడి గ్యాంగును తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక వెల్లడైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON