loader

చైనా మంజాపై.. సీపీ సజ్జనార్‌కు HRC నోటీసులు జారీ..

పతంగుల పండుగ వేళ నగరాన్ని వణికిస్తున్న చైనా మాంజా (సింథటిక్ దారం) వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రాణాంతకంగా మారిన ఈ దారం వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ మాంజా అమ్మకాలను, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ దారాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి..

జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ డ్రోన్ల కదలికలు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేశాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద డ్రోన్లు సంచరించినట్లు నివేదికలు అందాయి. శత్రు దేశం నుండి వచ్చిన ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను తరలించే అవకాశం ఉందన్న అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది. రాజౌరి సెక్టార్‌లో గత 48 గంటల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

మహిళలను రెడీగా ఉండమన్నారు.. ఇంకెప్పుడు?

మహాలక్ష్మి పథకాన్ని ఎప్పటికి అమలు చేస్తారంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడును షర్మిల ప్రశ్నించారు. “రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతీగతి లేదు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు” అంటూ వైఎస్ షర్మిల […]

జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు ఉద్యోగ సంఘాల పిలుపు

బ్యాంకుల్లో వారంలో ఐదు పనిదినాలను డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్  కాన్ఫెడరేషన్ (AIBOC), జనవరి 27, 2026 మంగళవారం రోజున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.  బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌ను తరుచుగా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలు (అన్ని శనివారాలు సెలవు దినాలు) డిమాండ్‌కు సంబంధించి మార్చి 2024లో సంతకం చేసిన వేతన సవరణ ఒప్పందం సమయంలో బ్యాంకు యూనియన్లు […]

ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు భోగి పండుగ (జనవరి 14) సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భోగి పర్వదినం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ఆరంభంగా భోగి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఇది ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాలకు సంకేతమని సీఎం తెలిపారు.

మేడారం జాతరకు 3,495 ప్రత్యేక బస్సులు… మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ

ఈ ఏడాది జరగనున్న మేడారం మహా జాతరకు 3,495 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టుగా టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నట్టుగా పేర్కొంది. అయితే ఈ బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్) కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

బిహార్‌లో కాంగ్రెస్ ఖాళీ.. ఎన్డీయేకు జైకొట్టనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు

రెండు నెలల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ కానుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్‌బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయ్యింది.!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు మాత్రం కొంత నెమ్మదిగా ఫీడ్ రిఫ్రెష్ అయినా వెబ్సైట్ మాత్రం బాగానే పని చేసింది. కానీ డౌన్ డిక్టేటర్ లో అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం యాప్ లాగిన్ మరియు ఫీడ్ రిఫ్రెష్ వంటి మరిన్ని సమస్యలు కొంత మంది యూజర్లు చూస్తున్నట్లు చెబుతున్నారు.సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్

సమ్మక్క సారక్క సీతక్క పాట సిడిని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ వారి బృందంతో కలిసి తెలంగాణ కుంభమేళాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పాట రచించి, పాడి, వీడియో రూపంలో చిత్రీకరించిన సమ్మక్క సారక్క సీతక్క పాట సిడిని మంగళవారం ప్రజా భవన్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటలో రాష్ట్ర మంత్రి సీతక్క కూడా తన గానం కలిపి సమ్మక్క సారక్కలపై ఉన్న భావోద్వేగాన్ని […]

గోదావరి తీరాన సాహస క్రీడలు- ఆత్రేయపురం అంటే పూతరేకులే కాదు

ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో బోట్‌ రేస్‌లు కూడా అంతే ఫేమస్‌. పొడవాటి పడవల్లో వరుసగా కూర్చొన్న క్రీడాకారులు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఒకే లయల తెడ్లు వేస్తూ ముందుకు సాగడం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. జట్టును సమన్వయం చేసుకుంటూ విజయం దిశగా సాగే పోటీ. ఒకరికొకరు తోడై, టీమ్‌లుగా విడిపోయి పడవలను వేగంగా నడిపిస్తూ గమ్యానికి చేరుకోవడంలో ఉన్న ఉత్సాహం వర్ణనాతీతం. ఆత్రేయపురం కాలువల్లో సాగే ఈ పోటీల్లో యువతతోపాటు అనుభవం ఉన్న పెద్దలు కూడా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON