loader

డీక్లెర్క్ సిక్సర్ల మోత.. ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన ఆర్సీబీ ..!

డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. 65కే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని ఆదుకున్న ఈ సఫారీ చిచ్చరపిడుగు.. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. దాంతో.. ఓటమి ఖాయమనుకున్న మంధాన సేన అనూహ్యంగా 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

అమెరికా ఆధీనంలో మరో చమురు నౌక!

ట్రంప్ యంత్రాంగం వెనిజులాకు అక్కడి నుండి ప్రయాణించే అనుమతి పొందిన ట్యాంకర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో అమెరికా సైన్యం కరేబియన్‌ సముద్రంలో మరో చమురు నౌకను స్వాధీనం చేసుకుంది. ‘ఒలినా’ అనే నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. యూఎస్‌ మెరైన్‌ అండ్‌ నేవీ సాయంతో ఈ ఆపరేషన్‌ చేపట్టామని పేర్కొన్న అమెరికా దళాలు నేరస్థులకు సురక్షితమైన ప్రదేశం లేదని స్పష్టం చేసింది.

హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు.. భయభ్రాంతులకు గురైన వాహనదారులు..!

హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుతం ఏర్పడడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యాయి. అయితే.. వెంటనే అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన చోట భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులను అలర్ట్ చేస్తూ పక్కనుంచి వెళ్లాలని చెబుతున్నారు. అదృష్టవశాత్తూ రోడ్డు కొద్దిగా కిందకు కుంగిన వెంటనే అప్రమత్తవడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు […]

భోగాపురం ఎయిర్‌పోర్టు కంటే వందేభారత్ ఎక్కడమే బెటర్.. బీజేపీ ఎమ్మెల్యే

అధికార కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు .. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం కంటే.. వందే భారత్ రైలు ఎక్కి.. విజయవాడకు చేరుకోవడమే సులభమని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

28 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన జనవరి 28న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదట విడత ఫిబ్రవరి 13 వరకూ,అనంతరం రెండో  మార్చి 9న ప్రారంభమైన ఏప్రిల్ 2 […]

‘మన శంకరవరప్రసాద్‌గారు’ టికెట్ రేట్లు పెరిగాయ్..

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’స్పెషల్‌ ప్రీమియర్‌తో పాటు, టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న మెగా మూవీ స్పెషల్‌ ప్రీమియర్‌  షో టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించారు. జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం కల్పించింది. అలాగే, రోజుకు 5 షోలకు కూడా అనుమతి ఇచ్చింది.

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ వాట్సప్‌ నెంబర్

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2025 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. తాజా టెట్‌ పలితాల్లో 97,560 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్‌ వెల్లడించారు. అంటే మొత్తం 2,71,692 మందిలో 39.27 శాతం మంది మాత్రమే అర్హత ఉత్తీర్ణత సాధించారన్నమాట. గతంతో పోల్చితే టెట్‌ ఉత్తీర్ణత ఈసారి భారీగా తగ్గింది. 31,886 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులలో 15,239 మంది టెట్‌లో ఉత్తీర్ణులైనారు. టెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు 9552300009 వాట్సప్‌ నెంబర్ […]

లోయలో పడ్డ టూరిస్టు బస్సు..8 మంది మృతి, 10 మందికి సీరియస్!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిపుర్ధార్‌ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటి వరకు 8మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిర్మౌర్‌లోని సంగ్రా సబ్‌డివిజన్‌లోని హరిపుర్‌ధర్‌లో ఒక ప్రైవేట్ బస్సు ఎతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు

‘చేతులు కాలాక…’ ఫ్యాన్స్‌ డిస్సప్పాయింట్‌ అయ్యారని ఆ సీన్స్ యాడ్ చేస్తున్న ‘ది రాజా సాబ్’

టీజర్, ట్రైలర్ చూసి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన జనాలకు ‘ది రాజా సాబ్’ మూవీ పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. ఓల్డ్ ఏజ్ ప్రభాస్ సీన్స్, మూవీలో కనిపించలేదు. ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారనే ఫీడ్ బ్యాక్ రావడంతో ‘ది రాజా సాబ్’ మూవీ టీమ్, ఈ సీన్స్‌ని యాడ్ చేయాలని అనుకుంటోందట. మూడు రోజుల తర్వాత మొదలయ్యే సంక్రాంతి సీజన్‌లో 5 నిమిషాల ఫుటేజీని జత చేయాలని ‘ది రాజా సాబ్’ టీమ్ నిర్ణయం తీసుకుందట..

నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌,నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!

IPAC కార్యాలయంలో ED సోదాలకు నిరసనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాదవ్‌పూర్ నిరసన మార్చ్‌లో పాల్గొన్నారు. మమత మాట్లాడుతూ, ‘బెంగాల్ మేల్కొంది, ప్రజల మద్దతు లభిస్తోంది. ‘అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు, మహారాష్ట్ర, హర్యానా, బిహార్లను బలవంతంగా ఆక్రమించారు, ఇప్పుడు బెంగాల్‌ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు. బీజేపీకి చెందిన దొంగ జగన్నాథ్ కూడా ఉన్నారు. జగన్నాథ్ ద్వారా, శుభేందు ద్వారా డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది. నా దగ్గర అన్ని పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి, అన్నీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON