సెమిస్టర్ ప్రశ్నపత్రాల లీకేజీ.. 35 మంది ఏఈవో అభ్యర్దుల ప్రవేశాలు రద్దు..!
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం రేపింది. సెమిస్టర్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు యూనివర్సిటీ అధికారులు. అంతేకాదు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్దుల ప్రవేశాలను సైతం రద్దు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. 2025- 26 థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు, వాట్సప్తో ఇలతర వ్యవసాయ కళాశాలల విద్యార్ధులకు పంపినట్టు నిర్ధరణకు వచ్చారు.

