loader

శ్రీమఠానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు గురువారం పోటెత్తారు. నూతన సంవత్సరం కావ టంతో దేశనలుమూలలు నుంచి లక్షలాది మంది భక్తులు వరదలా తరలివ చ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారు జామునుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. 2026 ప్రారంభం కావడంతో గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు […]

తెలంగాణ పోలీసుల అదుపులో మావో అగ్రనేత బర్సెదేవా.

మావోయిస్టు దళంలోని మరో అగ్రనేత బర్సెదేవా అలియాస్ సుక్కాతో పాటు 15మంది మావోయిస్టులు తెలం గాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి బర్సెదేవా సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవా కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. బర్సెదేవాపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గతంలోనే ప్రకటించారు.

న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది.

ఏపీలోనూ మందుబాబులు రఫ్పాడించారు.. డిసెంబర్ చివరి 3 రోజుల్లో రికార్డు స్థాయిలో..

ఆంధ్రాలో 2025 డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు రూ. 2,767 కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ మూడు రోజుల్లో మాత్రమే సుమారు రూ. 543 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి విశాఖపట్నం జిల్లా డిసెంబర్ నెలలో అత్యధికంగా సుమారు రూ. 178.6 కోట్లు […]

పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు

గత మూడురోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసం సమీపంలో డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని, ఆ దేశంపై ఆరోపణలు చేశారు. దీన్ని ఉక్రెయిన్ దేశం ఖండించినా రష్యామాత్రం దీన్ని నమ్మలేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా ఉక్రెయిన్, పుతిన్ ను హత్య చేయడానికి ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్పష్టం చేసింది.

నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా: కేటీఆర్

నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘మేము మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి. చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా. మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా. సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో […]

రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలో మండలాల వారీగా స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయనుండగా, రైతులు తాము చెందిన మండలంలో నిర్ణీత తేదీన పాసు పుస్తకాలను పొందే అవకాశం కలుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకాలలో ఏవైనా వివరాల లోపాలు ఉంటే, సంబంధిత […]

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై దాడి.. సజీవదహనానికి యత్నం..

బాంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.  హిందువులపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. తాజాగా డిసెంబర్ 31వ తేదీన షరియత్ పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకాన్ దాస్ అనే హిందూ వ్యక్తిపై ఉన్మాద మూక జరిపిన దాడి నాగరిక సమాజాన్ని నివ్వెరపరిచింది. బాధిత ఖోకాన్ దాస్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..  ఒక గుంపు అతనిని చుట్టుముట్టింది. మారణాయుధాలతో విచక్షణా  రహితంగా దాడిచేయడమే కాకుండా తీవ్రంగా గాయపడిన అతనిని సజీవ దహనం చేసేందుకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అతను కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స […]

అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మంత్రి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో త్రాగు నీరు కాలుష్య ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది మృతిచెంద‌గా, సుమారు 1500 మందికిపైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.  నీటి కాలుష్యం ఘ‌ట‌న గురించి ఎన్డీటీవీ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి కైలాశ్ విజ‌య‌వ‌ర్గీయా నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందిన వారికి బిల్లులు ఎందుకు చెల్లించ‌లేద‌ని, ప్ర‌త్యామ్నాయ మంచినీటి సౌక‌ర్యాన్ని ఎందుకు క‌ల్పించ‌లేద‌ని జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న వేశారు. అయితే అన‌వ‌స‌ర ప్ర‌శ్న‌లు వేయ‌కండి అన్న మంత్రి ఆ త‌ర్వాత […]

న్యూ ఇయర్ ఎఫెక్ట్ తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

తిరుమల పుణ్యక్షేత్రంలో నూతన సంవత్సర వేడుకల వేళ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుపతి నగరం నుండి కొండపైకి వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. నూతన సంవత్సరం 2026 సందర్భంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. దీనివల్ల తిరుపతి నగరం వాహనాలతో కిక్కిరిసిపోయింది. అలిపిరి టోల్ గేట్ నుండి తిరుపతిలోని గరుడ జంక్షన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల రద్దీ నిరంతరాయంగా పెరుగుతుండటంతో పరిస్థితిని అదుపు చేయడం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON