loader

చివరి టి20లోనూ భారత్ దే విజయం

న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్య భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు భార్య హౌస్‌ మోషన్‌ పిటిషన్‌.. పోలీసులపై ఫిర్యాదు

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారన్న క్రమంలో ఆయన భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో పాటు మరో 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని,  విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించాలని […]

అంబటి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అరెస్ట్ చేయాలి… జనసేన పార్టీ

మాజీమంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి పోలీసులు అరెస్ట్ చేయాలి… భవిష్యత్తులో ఇలా మరే ఇతర నాయకుడు ప్రవర్తించకుండా న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం మధ్యాహ్నం భారీగా హైడ్రోపోనిక్ (గాంజా) మత్తు పదార్థాలను డీఆర్‌ఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసిన అధికారులు.. వారినుంచి 9.5 కోట్లు విలువ చేసే27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌నుండి ధాయ్ ఎయిర్ లైన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నలుగురు ప్రయాణికులు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బయటకు రావడమేకాకుండా.. అక్రమంగా తెచ్చిన మత్తుపదార్థాలను రిసీవర్‌లకు అందిస్తూ దొరికిపోయారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

గాజాలో శాంతి స్థాపనకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మళ్లీ గాజా సిటీపై ఇజ్రాయెల్ సైనిక దళాలు శనివారం ఉదయం విరుచుకుపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం లోని ఉత్తర ప్రాంతంతోపాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం కూడా దాడులకు బలైంది. గాజా సిటీ లోని ఒక అపార్ట్‌మెంట్‌పైన, అలాగే ఖాన్ యూనిస్‌లో నిర్వాసితుల శిబిరాలపై జరిగిన దాడిలో మొత్తం 12 మంది మృతి చెందారు.

ఓడరేవు నగరంలో భారీ పేలుళ్లు..భవనాలు,దుకాణాలు ధ్వంసం..అనేక మంది దుర్మరణం..!

ఇరాన్ దక్షిణ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌ను శనివారం భారీ పేలుడు కుదిపేసింది. బహుళ అంతస్తుల భవనంలో పేలుడు సంభవించిందని ఇరాన్ రాష్ట్ర మీడియా పేర్కొంది. అయితే పేలుడుకు కారణం ప్రస్తుతానికి తెలియరాలేదు. ఈ ఘటనలో అనేక మంది మరణించినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన, పేలుడు గురించి ఊహాగానాలు, ఆందోళనలకు ఆజ్యం పోసింది.

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజామిల్‌ను ఎపి ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ముజామిల్‌పై అనేక కేసులు ఉన్నాయి. అతడిపై 87 శాతం కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయి. అప్పటి నుంచే ముజామిల్ తప్పించుకు తిరుగుతున్నాడు. చైనా జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ముజామిల్‌కు సంబంధాలు ఉన్నాయి’’ అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని ఎపి డిప్యూటీ సిఎం పవన్ […]

జనాన్ని వీడి వనంలోకి వన దేవతల ప్రవేశం – ముగిసిన మేడారం జాతర

మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల అనంతరం రాత్రి వనదేతవలు వన ప్రవేశం చేశారు. డప్పు, డోలు వాయిద్యాలతో పూజారులు వనదేవతలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను, పూనుగుండ్లకు (మహబూబాబాద్‌) పగిడిద్దరాజు తరలించారు. గద్దెల పరిసరాల్లో విద్యుత్ దీపాలు నిలిపివేసి పూజారులు వన ప్రవేశం చేయించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

అంబటి రాంబాబును ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

టీడీపీ శ్రేణుల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటికి ధైర్యం చెప్పారు. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని జగన్‌ పేర్కొన్నారు చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అంబటిపై దాడి జరిగిందని ఆరోపించారు. కూటమి అరచకాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీ మొత్తం అంబటికి అండగా ఉంటుందని వివరించారు.

గుంటూరులో హైటెన్షన్ .. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అంబటి రాంబాబు వెంటనే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అభిమానులు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON