loader

తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు

తైవాన్‌లో 7.0 తీవ్రతతో భయంకరమైన భూకంపం సంభవించింది. తైపీలోని భారీ భవంతులు ఒక్కసారిగా కంపించాయి. తైవాన్ వాతావరణ సంస్థ భూకంపం సంభవించినట్లు ధృవీకరించింది. సెంట్రల్ వెదర్ ఏజెన్సీ ప్రకారం, శనివారం రాత్రి 11:05 గంటలకు తైవాన్ ఈశాన్య తీర నగరమైన యిలాన్‌లో భూకంపం సంభవించింది. ఫైర్ ఏజెన్సీ దీని గురించి X (ట్విట్టర్)లో సమాచారం ఇచ్చింది. ప్రజలకు ముందుగా తమను తాము రక్షించుకోవాలని సూచించింది. ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలని చెప్పింది.

తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల…జనవరి 3 నుంచి పరీక్షలు

ెలంగాణ టెట్ (TET) – 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్‌-1, 2లకు కలిపి మొత్తం […]

అది ఉన్మాదం.. మీది కడుపుమంట.. మంటపెట్టిన జంతు బలి-2

మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరగడం చూసి కూటమి నేతలకు కడుపుమంటగా ఉందని వైసీపీ నేత వరుదు కళ్యాణి ఆరోపించారు. కడుపు మంట ఎక్కువై.. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ,  వైసీపీ కార్యకర్తలపై ఏవిధంగా అక్రమ కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో చేసిన జంతు బలుల గురించి ఎందుకు మాట్లాడరని..ఓజీ సినిమా అప్పుడు కత్తులు చూపిస్తే ఎందుకు మాట్లాడలేదని హోం మంత్రి వంగలపూడి అనితను […]

అది ఉన్మాదం.. మీది కడుపుమంట.. మంటపెట్టిన జంతు బలి-1

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా మేకలు, పొట్టేళ్లు నరికి వాటి రక్తంతో వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేయటం వివాదాస్పదమవుతోంది. హోం మంత్రి.. వైఎస్ జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు. బహిరంగ స్థలాల్లో జంతుబలి నేరమన్న హోం మంత్రి అనిత.. ఇలాంటి చర్యలతో ఉన్మాదుల తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

దేశం మెచ్చే విద్యా సంస్థగా ఎన్టీఆర్ విద్యా సంస్థలు వెలుగొందాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ లోని గండిపేటలో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాలినడకన తిరుగుతూ ఎన్టీఆర్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాం. చిన్న మొక్కగా ప్రారంభించిన విద్యా సంస్థలను పెద్ద వృక్షంగా మార్చారు. సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం.’అని […]

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో  రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. వాయు కాలుష్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. భాగ్యనగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 230 దాటి ప్రమాదకర స్థాయికి […]

గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఎంట్రీ

ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఇక ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జనాల ముందుకు వస్తుండటంతో అభిమానులు భారీగా హాజరయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. గుబురు గడ్డం, పిలక జుట్టుతో సరికొత్త లుక్ లో అదరగొట్టాడు డార్లింగ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ప్రభాస్ తన తర్వాతి సినిమా స్పిరిట్ కోసమే ఇలా పిలక జుట్టును పెంచుకుంటున్నారని […]

ఫుట్‌బాల్‌ ఆడేందుకు డబ్బులుంటయి.. కానీ పేదల ఇండ్లకు ఉండవా..?

రూ.100 కోట్లు పెట్టి మనువడితో ఫుట్‌బాల్‌ ఆడడానికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు డబుల్ బెడ్‌రూమ్ నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర డబ్బులు ఉండవా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘాటుగా విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్‌రూమ్‌ను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని..అలాగే నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్‌రూమ్‌ల వద్ద లబ్దిదారులతో కలిసి శనివారం […]

పిచ్చికుక్క భీభత్సం.. ఒకే రోజు 21 మందిపై దాడి.. భయాందోళనలో భక్తులు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం.. తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఒక్క పిచ్చికుక్క వరుసగా దాడులు చేయడంతో 21 మంది భక్తులు కుక్కకాటుకు గురైనట్లు బాధితులు తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రాజన్న క్షేత్రంలో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రేబిస్ టీకా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు వారిని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]

ఉపాధి హామీ రద్దు, నోట్ల రద్దు లాంటి మరో విపత్తు : రాహుల్ గాంధీ

గ్రామీణ పేదలకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలపైనా,  పేదలపైనా జరిపిన ‘విధ్వంసకర దాడి’ అని అభివర్ణించారు. నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) సమయంలో ప్రధాని ఎలాగైతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారో, ఇప్పుడూ అలాగే వ్యవహరించారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON