ఘోర ప్రమాదం.. టైరు పేలి కార్లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి తిరుచిరాపల్లి జిల్లాలో బస్సు అదుపుతప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకు బయలుదేరింది. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై దాని టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపున వాహనాలపైకి దూసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. రెండు కార్లును బస్సు ఢీకొట్టిందని చెప్పారు.

