loader

ఘోర ప్రమాదం.. టైరు పేలి కార్లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి తిరుచిరాపల్లి జిల్లాలో బస్సు అదుపుతప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకు బయలుదేరింది. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై దాని టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపున వాహనాలపైకి దూసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. రెండు కార్లును బస్సు ఢీకొట్టిందని చెప్పారు.

పీపీపీ విధానంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించిన సీఎం పీపీపీ విధానంపై ముందుకేనని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు విజీఎఫ్‌కు నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. ఆదోని మెడికల్ కాలేజ్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని వివరించారు.

ఇది మీ చేతకాని తనం.. నీ అసలు రూపం ఇదీ: శివాజీపై మరోసారి చెలరేగిన అనసూయ

నటుడు శివాజీ, నటి అనసూయ భరద్వాజ్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆమె అసలు ఈ ఇష్యూలోకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన శివాజీ.. తనపై జాలి చూపించినందుకు థ్యాంక్స్ చెప్పారు ఆపై ఆయన క్షమాపణలు, అనసూయ కౌంటర్లు.. ఇదంతా ఇప్పుడు హాట్ టాపిక్. శివాజీ ‘విక్టిమ్ ప్లే’ చేస్తున్నారని, ఇది నార్సిసిజం, మిసోజనిస్టిక్ లక్షణమని అనసూయ విమర్శించారు. ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛ గురించి ఆమె గట్టిగా మాట్లాడారు.

‘భారత్​ డెడ్ సొసైటీగా మారిపోతోంది’- ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని కలిసిన రాహుల్​

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బుధవారం దిల్లీలోని 10 జన్​పథ్​లోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో బాధితురాలితో రాహుల్​ మాట్లాడారు. బాధితురాలితో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రంగా మండిపడిన రాహుల్‌, అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ వచ్చిందని, బాధితులనేమో నేరస్థులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. భారత్​ డెడ్​ ఎకానమీ కాకుండా డెడ్ సొసైటీగా మారిపోతుందని ఆరోపించారు.

లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తనపై సవాళ్లు విసురుతున్న తీరు సరైంది కాదన్నారు. “ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటికి నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా? లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు” అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

నేనుంత కాలం కెసిఆర్‌కు అధికారం రానివ్వను: రేవంత్

నారాయణపేట జిల్లా కోస్గిలో సిఎం పర్యటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి రేషన్ కార్డు రాని వారి పేర్లు రాసుకోవాలని సూచించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు తాను ఉన్నంతకాలం కెసిఆర్‌కు అధికారం దక్కనివ్వనని సిఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించామని. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా వాళ్లదే పై చేయి అంటారా? అని ప్రశ్నించారు

డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ జంట అరెస్ట్

 డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పిఎస్ పరిధిలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల్లో ముగ్గురు పెడ్లర్లు, ఒక వినియోగదారుడు ఉన్నారు. వారి నుంచి 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండిఎంఎ, 5.5 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్, 6 ఎల్ఎస్‌డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇమాన్యుయేల్, సుస్మిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతడితో కలిసి .విలాసాలకు […]

కెనడాలో భారతీయ మహిళ హత్య.!

కెనడాలోని టొరంటోలో హిమాన్షీ ఖురానాఅనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఖురానాపై తొలుత లైంగిక దాడి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు..ఆపై హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా..ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న గఫూరీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

అథ్లెటిక్ జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం

భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని, ఏపీ శాప్ […]

నువ్వు ఐదుసార్లు సీఎం అవ్వాలి.. ఇప్పటం వృద్ధురాలి కోరిక విని నవ్వేసిన పవన్ కల్యాణ్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆనందంతో ముసిరిపోయిన నాగేశ్వరమ్మ.. పవన్ కల్యాణ్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమను కలిసేందుకు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను ఆ సమయంలో కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON