loader

ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా లొకేషన్ పంపే గూగుల్ ఎమర్జెన్సీ సర్వీస్

భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ భారత్‌లో **Android Emergency Location Service (ELS India)**ను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తి తన లొకేషన్ చెప్పలేని పరిస్థితి ఏర్పడితే, ఈ సర్వీస్ ప్రాణరక్షకంగా మారనుంది. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుని 112కు కాల్ చేసినా లేదా ఎమర్జెన్సీ మెసేజ్ పంపినా, వారి స్మార్ట్‌ఫోన్ నుంచి లొకేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. దీంతో సహాయక బృందాలు వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.

ఐదు జిల్లాల్లో యూరియా యాప్ ప్రయోగాత్మకంగా అమలు: మంత్రి తుమ్మల

వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు పారదర్శకంగా, అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకు ప్రవేశ పెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాల్లో సుమారు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 19,695 మంది రైతులు ఈ యాప్ ద్వారా తమ సమీప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నట్లు […]

లోకేశ్ అవినీతిలో పవన్ కు వాటా ఉందంటూ అంబటి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార యంత్రాంగం మరియు కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత బంధాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేశ్ అవినీతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు భాగస్వామ్యం ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైద్య కళాశాలల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, అందులో పవన్‌కు కూడా వాటా అందుతోందని అంబటి పేర్కొన్నారు.

విశాఖలో షఫాలీ సునామీ.. రెండో టీ20లోనూ చిత్తైన శ్రీలంక..!

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలకమైన షఫాలీ వర్మ(69 నాటౌట్) టీ20 సిరీస్‌లోనూ దంచేసింది. వైజాగ్ మైదానంలో మంగళవారం శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తూ హాఫ్‌ సెంచరీతో చెలరేగింది. తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించిన లేడీ సెహ్వాగ్ జట్టుకు భారీ విజయాన్ని అందించింది. స్వల్ప ఛేదనలో షఫాలీ మెరుపులతో ఏడు వికెట్ల తేడాతో లంకను టీమిండియా మట్టికరిపించింది. వరుసగా రెండో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

SIR ముసాయిదాలో కనిపించని 95లక్షల ఓటర్లు

సర్ ప్రక్రియలో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, అండమాన్ నికోబార్‌లలో మంగళవారం వెల్లడించిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 3.10 లక్షల ఓటర్లకుగాను 64,000 మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. అదే విధంగా కేరళలో 2.78 కోట్ల ఓటర్లకు గాను 24.08 లక్షల ఓటర్లు, చత్తీస్‌గఢ్‌లో 2.12 కోట్ల ఓటర్లకుగాను 27.34లక్షల మంది పేర్లు, మధ్యప్రదేశ్‌లో 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74లక్షల ఓటర్లను జాబితా […]

దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు

నటుడు శివాజీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టకేలకు శివాజీ దిగొచ్చాడు. మహిళలకు క్షమాపణలు చెప్పాడు. నేను మాట్లాడింది అందరు అమ్మాయి గురించి కాదు, హీరోయిన్‌ బయటికి వెళ్లినప్పుడు దుస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశ్యం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్టి. ఒక అమ్మావారిలా అనుకుంటాను. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, మహిళలు ఎవరైతే తప్పుగా భావిస్తే, మీ అందరికి […]

వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు…సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు, ఇంకా 8 ఏళ్ల కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. బస్సుల రోడ్ మ్యాప్‌పై ముఖ్యమంత్రి […]

ఎంజీయూ సమస్యలపై కేటీఆర్‌కు విద్యార్థుల‌ వినతి

న‌ల్ల‌గొండ‌లోని మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై వ‌ర్సిటీ విద్యార్థులు కేటీఆర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.బీఆర్ఎస్ సమావేశానికి హాజ‌రయ్యేందుకు వెళ్తున్న‌ బ కేటీఆర్‌ను మార్గమధ్యంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు విన్న‌వించి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ముఖ్యంగా పెండింగ్ స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాల్సిందిగా కోరారు.

‘నీ నీతులు ఇంట్లోనే చెప్పుకో’.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్‌ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా స్పందిస్తూ.. హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నాకు అనవసరం. నీలాంటి ఒక అసభ్యకరమైన పద్ధతి లేని వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి.. వెళ్లి నీ నీతులు వాళ్ల‌కి చెప్పుకో. అంతేగాని సమాజంలో ఉన్న‌ మహిళలపై గానీ, చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై గానీ నీ చెత్త అభిప్రాయాలను రుద్ద‌కు” అంటూ శివాజీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON