loader

తిలక్ వర్మ ఒంటరి పోరాటం వృథా! రెండో టీ20లో చిత్తుగా ఓడిన భారత జట్టు…

రెండో టెస్టులో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుని.. ఛేదనలో ఓడింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా, 19.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది భారత జట్టు.. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ […]

ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్.. కీలక అంశాలపై చర్చలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని వారు సమీక్షించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం పెంచడానికి ఉన్న వేగాన్ని కొనసాగించడం ఎంత ముఖ్యమో వారు నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేవలం ఒక వారం గ్యాప్‌లోనే ఈ సంభాషణ జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రంగాల్లోనూ సహకారం పెరుగుతున్నందుకు మోదీ, […]

95 ఏళ్ల వయసులో పోటీ.. సర్పంచ్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తండ్రి..!

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రి గంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. 95 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మండల కేంద్రమైన నాగారం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పించ్‌గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.

బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్- పోలింగ్ ఎప్పుడంటే?

బంగ్లాదేశ్​లో కీలక రాజకీయ పరిణామం జరిగింది. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి జరిగే సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 12న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏఎంఎం నాసిరుద్దీన్ గురువారం ప్రకటించారు.

టీమిండియా ముందు 214 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా… 90 పరుగులు చేసి రనౌట్ అయిన క్వింటన్ డి కాక్..

ముల్లాన్‌పూర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, సెంచరీని మిస్ చేసుకున్నాడు. 90 పరుగుల వద్ద రనౌట్ అయ్యి, పెవిలియన్ […]

7 వైడ్లు, 13 బాల్స్! పరమ చెత్త రికార్డు క్రియేట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్…

సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓవర్ మొదటి బంతికి క్వింటన్ డి కాక్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వరుసగా రెండు వైడ్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్, రెండో బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా నాలుగు వైడ్లు వేశాడు. ఇలా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 7 వైడ్స్, 13 బాల్స్ వేసి… 18 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో సుదీర్ఘ ఓవర్ వేసిన […]

కేటీఆర్‌ పరువు నష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్ వారెంట్

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొండా సురేఖను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నాంపల్లి స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిపై లైంగిక దాడి.. యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్..!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్‌ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది. ఇంతకూ అతడు ఎవరంటే.. బంగ్లాదేశ్‌ ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్. ఈ యంగ్‌స్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో.. సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేసి […]

ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’

ఎన్టీఆర్ భవన్​లో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు కాఫీ కబుర్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాలను మెరుగు పరుచుకోవాలని సీఎం సూచించారు. పార్టీ సిద్దాంతాలు, భావజాలం ప్రతి కార్యకర్తకు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు జాగ్రత్తలు తప్పనిసరి..!

శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇటీవల పెరుగుతుంది. జనవరి నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 24 కేసులు నమోదయ్యాయి అని DMHO డాక్టర్ అనిత తెలియజేశారు. రాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన కేసులను రిమ్స్ హాస్పిటల్  ELISA టెస్ట్ ద్వారా ఖచ్చిత నిర్ధారణ చేస్తున్నారు. రాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని భయపడినా, ELISA టెస్ట్‌లో నిర్ధారణ కాని సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే, జ్వరం ఐదు రోజులకు పైగా తగ్గకపోతే తప్పనిసరిగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON