loader

13కు చేరిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలిని పరిశీలించిన హోం మంత్రి..!

ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనంతరం.. సంఘటనా స్థలానికంటే ముందు ఎల్‌ఎన్‌జేపీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు పేలుడు గురించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పేలుడు జరిగిన ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లారు షా. పేలుడులో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు13 మంది చనిపోయారని సమాచారం.

ఢిల్లీ బాంబు దాడి మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనపై తన గాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా జీతో పాటు ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించాను,” అని పేర్కొన్నారు.

నా గొంతు కోసినా.. ఎస్ఐఆర్‌పై మమత ఆగ్రహం

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం, ఎన్నికల కమిషన్‌‌పై విమర్శలు గుప్పించారు. డీమోనిటైజేషన్, ఎస్ఐఆర్ డ్రైవ్‌ను ఒకేగాట కడుతూ మొదటిది ‘నోట్‌బందీ’ అయితే, రెండవది ‘ఓట్‌బందీ’ అని అన్నారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు. ఎస్ఐఆర్‌ను విమర్శించినందుకు బీజేపీ తనను జైలుకు పంపినా, గొంతు కోసినా ప్రజల ఓటు హక్కులను మాత్రం ఊడలాక్కోలేరని అన్నారు.

ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు.. అమిత్‌షా

ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వేగంగా స్పందించారు. ఎన్‌ఎస్‌జీ, ఎన్ఐఏ టీమ్‌లు, ఎఫ్ఎస్‌ఎల్‌ టీమ్‌లు కూలంకషంగా దర్యాప్తు జరుపుతున్నాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చాం. ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జితో మాట్లాడాను. వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతాం. ఆ వివారాలను పబ్లిక్‌కు తెలియజేస్తాం. ఆసుపత్రికి స్యయంగా వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని […]

ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.. ఇక ప్రతి మండలంలోనూ వర్క్ స్టేషన్లు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసుకునేందుకు వీలుగా.. ఈ వర్క్ స్టేషన్లు […]

కమ్మ, కాపు వేరు వేరు కాదు.. కులాలకు కొత్త భాష్యం చెప్పిన ఎమ్మెల్యే వసంత

టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కామెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైలవరంలో కాపు వన సమారాధన వేదికగా ఆయన కులాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సన్నిహితులంతా కాపువారేనన్నారు వసంతకృష్ణప్రసాద్‌. తన కంపెనీలను చూసుకుంటున్నది కూడా కాపులే అని చెప్పారు. తక్కువ పొలాలుంటే కాపువారని.. ఎక్కువ పొలాలుంటే కమ్మవారని అనేవారని చెప్పారు వసంతకృష్ణప్రసాద్‌. కాపు కమ్యూనిటీ భవనానికి విరాళంగా 10లక్షలు ప్రకటించారు వసంతకృష్ణప్రసాద్‌. కాపులు, కమ్మ అనే భేదం వద్దన్నారు. కమ్మ, కాపు కలిసి పనిచేస్తే అద్భుత […]

ఆ ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంది: సీఎం రేవంత్

భార‌త దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ప‌ని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మౌలానా జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (న‌వంబ‌రు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

ఢిల్లీ పేలుడుపై అమిత్‌షాకు ‌మోదీ ఫోన్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు. పేలుడుపై వివరాలు అడిగి  తెలుసుకున్నారు. అమిత్‌షా సైతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో కూడా అమిత్‌షా మాట్లాడారు.

ఢిల్లీ పేలుడుతో హైదరాబాద్‌లో హైఅలెర్ట్‌..సీపీ సజ్జనార్ ఆదేశాలు

దేశ రాజధాని ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధానిలో పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, నాకాబందీ ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సజ్జనార్‌ […]

9 మంది దుర్మరణం.. దేశంలో హైఅలర్ట్.. అసలేం జరిగిందంటే..?

ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ను టార్గెట్ చేసుకొవడం సాయంకాలంలో పేలుడు సంభవించడం వెనుక భారీ ఉగ్రకుట్ర ఉందని కారులో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొని వచ్చి మరీ ముందుగా ఎంచుకున్న విధంగా రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడును జరిపిఉండొచ్చని  రిమోట్ తో ఏమైన పేలుడు చేశారా..?.. అన్న కోణంలో కూడా అధికారులు విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా ఢిల్లీలో సోమవారం హలీడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట వద్ద ప్రజల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది.ఇతర రోజులలో అయితే..పరిస్థితి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON