loader

జేఎన్‌యూ ఎన్నికల్లో ‘లెఫ్ట్’ క్లీన్‌స్వీప్.. ఏబీవీపీకి ఘోర పరాభవం..!

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం Student Union Elections లో వామపక్ష సంఘాలు జయభేరి మోగించాయి. బీజేపీ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ(ABVP)ని సున్నాకే పరిమితం చేస్తూ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేశాయి. మంగళవారం జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ సంఘాలు మద్దతిచ్చిన అభ్యర్థులే నాలుగు సెంట్రల్ ప్యానెళ్లను గెలుచుకున్నారు. అధ్యక్ష పదవికి అదితి మిశ్రా ఎంపికవ్వగా.. ఉపాధ్యక్షుడిగా కీజాకుట్ గోపిక బాబు గెలుపొందారు. బ్యాలెట్ విధానంలో మంగళవారం ముగిసిన ఎన్నికల్లో విద్యార్థిలోకం ఏకపక్ష తీర్పునిచ్చింది.

జాతీయ గీతంపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్నాటకలోని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్‌ హెగ్డే జాతీయ గీతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతాన్ని బ్రిటిషన్‌ అధికారిని స్వాగతించేందుకు రాశారని వందే మాతరానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర కన్నడ ఎంపీ సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే తీవ్రంగా స్పందిచారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యను తప్పుపట్టారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర, వాట్సాప్‌ జ్ఞానమని అభివర్ణించారు.

అహ్మదాబాద్‌లో ఫైనల్.. ప్రపంచ కప్ వేదికలు ఇవే..!

భారత్, శ్రీలంక  T20 World Cup 2026 టోర్నీకి  ఇరుదేశాల్లోని వేదికలు ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. శ్రీలంక విషయానికొస్తే.. కొలంబో, క్యాండీ టోర్నీకి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 7న జరుగబోయే ఆరంభ పోరుకు వేదికైన అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. అయితే.. బీసీసీఐ, పాక్ బోర్డు అంగీకరించినందున పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించనున్నారు. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో […]

శ్రీ చరణికి షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితా ఇదే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్  రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల ఆధీనంలోని ఈ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజేతలైన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను జట్టుతోను ఉంచుకుంది. అయితే, మరో ఛాంపియన్ ప్లేయర్ శ్రీ చరణికి షాక్ ఇస్తూ వేలంలోకి వదిలిపెట్టింది. రిటెన్షన్ జాబితాలో మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్ లను కొనసాగించింది. ఈ ఐదుగురు గత మూడు సీజన్లలో ఢిల్లీ […]

రేపటి ప్రైవేటు కాలేజీల ‘స్వాంతన సభ’కు అనుమతి నిరాకరణ..!

ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్‌నగర్‌, ఉప్పల్‌, పరేడ్‌గ్రౌండ్‌ మైదానాల్లోనూ సభలకు అనుమతి నిరాకరించగా.. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలను అనుమతించడం లేదని.. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపింది.

చర్చి పాస్టర్ పై కేసు…

ఫతేనగర్‌లోని గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొంత కాలం నుంచి ప్రార్థనల కోసం చర్చికి వచ్చే మహిళలను వేధిస్తున్నాడు. తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి అంటూ ప్రార్థనలు జరగకుండా ప్రశ్నించిన వారిపై దాడి చేసి కొట్టారు, మహిళా భక్తులు అని చూడకుండా పాస్టర్  మహిళల వీడియోలు చిత్రీకరించడం, రహస్యంగా చర్చ్ లో సిసి కెమెరాలు పెట్టారు,  మహిళా  భక్తులను బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..

ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా […]

హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్

హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa)కు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విదేశాలకు చెందిన వేలాది మంది టాప్ పరిశోధకులు, యునైటెడ్ స్టేట్స్ నుండి H-1B వీసా హోల్డర్ల కోసం కెనడా ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 […]

రిటెన్షన్ తోనే దడపుట్టిస్తున్న ముంబై ఇండియన్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఎడిషన్‌కు ముందు ముంబై ఇండియన్స్ మహిళల జట్టు తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించింది. జనవరిలో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తొలిసారి మెగా వేలం ఫార్మాట్‌లో పోటీలు జరగనున్నాయి. అయితే, తమ రిటెన్షన్ తోనే ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. 2023, 2025 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఈసారి కూడా సమతుల్యమైన జట్టుతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది.

గ్రామ సచివాలయాల పేరు మార్చిన ప్రభుత్వం.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థ పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్స్‌గా పిలవబడతాయని తెలిపింది. ఈ పేరు మార్పు నేటి నుంచి అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON