loader

దిగ్గజాలను పట్టేస్తున్న లక్నో.. గ్లోబల్ ‘డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌’గా టామ్ మూడీ..!

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే కేన్ విలియమ్సన్‌ ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో యాజమాన్యం ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించనుంది. కోచ్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన వెటరన్ అయిన టామ్ మూడీని తమ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌’గా నియమించనుంది లక్నో. అయితే.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

అర్ధరాత్రి ఫోన్‌ చేసినా.. అరగంటలో మీ ముందుంటాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ బోరబండలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. ప్రతి పేద వాడికి మేం అండ‌గా నిల‌బ‌డతాం.. బుల్డోజ‌ర్లకు అడ్డంగా ప‌డుకుంటామని స్పష్టం చేశారు. సునీత‌మ్మకు అండగా నేనున్నా.. కేసీఆర్ ఉన్నారు.. ప‌క్కనే తెలంగాణ భ‌వ‌న్ ఉందని తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్దగంట‌లో మీ వ‌ద్దకు వ‌స్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు భ‌య‌పెడితే.. మేం వ‌చ్చి వాళ్ల సంగ‌తి తేలుస్తామని స్పష్టం చేశారు.

ఎయిర్‌ ఇండియా విమానం.. మంగోలియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..

ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్‌ ఇండిమా విమానాన్ని అత్యవసరంగా మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్‌లైన్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లైయిట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బోయింగ్ 777 విమానాన్ని ప్రస్తుతం తనిఖీ కోసం ఉలాన్‌బాతర్ విమానాశ్రయంలో ఉంచినట్లు పేర్కొంది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. విమాన ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తలేదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.

ఏలూరులో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా.. ఇద్దరు ప్రయాణికులు మృతి..!

ఏపీలో ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. లింగపాలెం మండలం జూబ్లీనగర్‌ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ బస్సును భారతి ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  మరో పది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విజయ్ కార్యాలయానికి సీబీఐ..

తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళంగం (TVK) చీఫ్ విజయ్ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సోమవారంనాడు టీవీకే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కనూర్ తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి వివరాలను అడిగినట్టు తెలిపారు. ‘అధికారులు వివరాల కోసం వచ్చారు, ఇంటరాగేషన్ కోసం కాదు. వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ వివరాలు అందజేసేందుకు మేము అంగీకరించాం’ అని […]

SIRపై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన రెండో విడత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సుప్రీంకోర్టులో సోమవారంనాడు పిటిషన్ వేసింది. డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్‌ను డీఎంకే ఎంపీ, సీనియర్ అడ్వకేట్ ఎన్ఆర్‌ ఇలాంగో ద్వారా సుప్రీంకోర్టులో వేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహిస్తామంటూ అక్టోబర్ 27న ఈసీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టి వేయాలని ఆ పిటిషన్‌లో […]

ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్

విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నామని నారా లోకేష్ ప్రకటించారు. సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఇప్పటివరకు 45దేశాల నుంచి 300మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నాం. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని తెలిపారు.

ప్రపంచకప్‌ విన్నింగ్ సంతోషం.. హర్మన్‌ప్రీత్ క్రేజీ టి-షర్ట్

మహిళల ప్రపంచకప్‌ను తొలిసారి భారత జట్టు గెలవడంతో హర్మన్‌ప్రీత్ రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. హర్మన్‌ చేతిలో ప్రపంచకప్‌ను పట్టుకొని పడుకోవడం మనం ఆ ఫోటోలు చూడొచ్చు. అన్నిటికన్న.. ఆ ఫోటోలో ఆమె ధరించిన టి-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపై ‘క్రికెట్ అంటే కేవలం జెంటిల్‌మెన్స్ గేమ్ కాదు.. అది అందరి గేమ్’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

చేవెళ్ల ప్రమాదం.. బస్సు కానీ, డ్రైవర్ కానీ కారణం కాదు: ఆర్టిసి

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టిసి అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆర్టిసి ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆర్టిసి వెల్లడించింది. రోడ్డు మలుపులో అతి వేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది. ప్రమాదానికి ఆర్టిసి బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని ఆర్టిసి స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేవని తేలినట్లు […]

మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా అమ్మాయిల జట్టు ప్రపంచకప్ సాధిస్తే సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు, సోలార్ ప్యానెళ్లు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు త్వరలోనే మహిళా జట్టు సభ్యులకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని, వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తానని సోషల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON