loader

శ్రీకాకుళం తొక్కిసలాటపై చంద్రబాబు సీరియస్..

సామాన్య భక్తుల ప్రాణాలను బలితీసుకున్న శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు ప్రైవేట్ వ్యక్తులవల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వస్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వహకులు నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని… తక్షణమే కస్టడీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఫ‌సీయుద్దీన్‌ను ఎందుకు బైండోవ‌ర్ చేయ‌డం లేదు..? : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేట‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు. బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్ఎస్పీ పోలీసుల‌ను డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసి గొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదు? అని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధానినరేంద్రమోదీ . తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ తొక్కిలాట ఘటన బాధాకరమైనదని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు : కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు

ఏపీ​లోని శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని తాను ఊహించలేదని, ఆలయానికి 2 వేల మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆలయంలోనే హరిముకుంద్‌పండాతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడారు. . ప్రస్తుతం కాశీబుగ్గ ఆలయ పరిసరాలను పోలీసులు […]

రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న

భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నతన ఆటకు శనివారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. నా జీవితానికే అర్థం చెప్పిన టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది. 20 ఏళ్ల సుమధురమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ఇప్పుడు రాకెట్‌ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే నాకు దక్కిన పెద్ద గౌరవం’ అని బోపన్న […]

మహిళా లాయర్‌ డిజిటల్‌ అరెస్ట్.. రూ.52 లక్షలు స్వాహా

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్‌ను డిజిటల్‌ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఫోన్‌ చేసి తీవ్ర బెదిరింపులకు గురిచేసింది అమెరికాలో మహిళా లాయర్ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆమె నుంచి రూ.52 లక్షలు కొల్లగొట్టింది. మూడు పోలీస్ బృందాలు యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ స్కాం సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్టు తెలుస్తోంది.  భారత దేశంలో వీళ్లు మొత్తంగా రూ.100 కోట్లకు పైగా […]

విజయ్ సభలో తొక్కిసలాటపై స్పందించిన హీరో అజిత్!

‘జనాలకు ఎవ్వరైనా వస్తున్నాడంటే ఎగబడి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా జనాలు పోగేసి, తమ పలుకుబడి చూపించాలని అనుకుంటున్నారు. దీనికి ఇకనైనా ముగింపు పలకాలి. నేను, ఎవ్వరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదు. దీనికి ఏ ఒక్కరినో తప్పు బట్టడం కరెక్ట్ కాదు. మనందరం కూడా బాధ్యులమే! మీడియా కూడా దీనికి కారణమే.. ఓ సమాజంగా ఇలా గుంపుగా గుమిగూడితే జరిగే అనార్థాల గురించి కనీస విచక్షణ ఉండడం చాలా ముఖ్యం.. జనాల్లో చైతన్యం […]

దేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ : సీఎం పనరయి విజయన్‌

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కీలక ప్రకటన చేశారు. దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు తెలిపారు. ‘నేటి కేరళ ఆవిర్భావ దినోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే కేరళను అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేము విజయం సాధించాం. ఈ శాసనసభ అనేక చారిత్రక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్షిగా నిలిచింది. నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే తరుణంలో అసెంబ్లీ ఇప్పుడు సమావేశమైంది’ అని అన్నారు.

700 కోట్ల అక్ర‌మాస్తుల కేసులో మాజీ మంత్రిపై ద‌ర్యాప్తున‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

శిరోమ‌ణి అకాళీ దళ్ మాజీ మంత్రి బిక్ర‌మ్ సింగ్ మ‌జీతియాపై అక్ర‌మాస్తుల ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అత‌నిపై కేసులో విచార‌ణ చేప‌డుతున్న‌ది. అయితే మ‌జీతియాపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ గులాబ్ చాంద్ క‌టారియా శ‌నివారం అనుమ‌తి ఇచ్చారు. మాజీ మంత్రి మ‌జీతియా వ‌ద్ద సుమారు 700 కోట్ల విలువైన అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2013లో డ్ర‌గ్ ట్రాఫికింగ్ నెట్వ‌ర్క్ ద్వారా సుమారు 540 కోట్లు ఆయ‌న […]

కాశీబుగ్గ ఆలయంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 10మంది భక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 10మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం, ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON