loader

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు.. ప్రధాని మోదీ నివాళులు

గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తైన ఐక్యతా విగ్రహం వద్ద శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని గుర్తుచేసుకుని భారతదేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గుజరాత్‌కు చేరుకుని, ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ పటేల్‌కు పుష్పాంజలి అర్పించారు. స్థానికులు, త్రివిధ దళాలతో కలిసి.. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెళ్లింట తీవ్ర విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వివాహ వేడుకల్లో భాగంగా పెళ్లి కుమార్తె తరఫు బృందం.. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి.. తిరిగి హనుమకొండ జిల్లా మహబూబాబాద్‌ వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో గోపాల్‌పుర్‌ వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ బోర్‌వెల్స్ లారీ.. ఆగి ఉన్న బొలేరోని ఢీకొట్టింది.దీంతో ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతిచెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి- నివాళులర్పించిన రాష్ట్రపతి

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ్ ఏకతా దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సర్దార్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.

వందే మాతరం…

ఈ పాట బంకిం చంద్ర ఛటర్జీ అత్యంత ప్రసిద్ధ నవల ఆనంద్ మఠం (1882) లో ఒక భాగం, ఇది సన్యాసి తిరుగుబాటు సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. 1950 జనవరి 24న, భారత రాజ్యాంగ సభ “వందేమాతరం”ను జాతీయ గీతంగా స్వీకరించింది. ఈ సందర్భంగా, భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ గీతాన్ని భారత జాతీయ గీతమైన “జన గణ మన”తో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు.

ఇందిరా గాంధీ వర్థంతి

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. 1984 అక్టోబరు 31న ఆమె అంగ రక్షకులే ఆమెను కాల్చి చంపారు. ఆమెను చంపిన ఇద్దరు అంగ రక్షకులూ సిక్కులే. స్వర్ణదేవాలయం దెబ్బతినడం వలన ఏర్పడిన ద్వేషానికి బలయిపోయింది

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత దక్కుతుంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు .

జెమీమా రోడ్రిగ్స్: క్రికెట్ ప్రపంచంలో అసాధారణ స్టార్‌

జెమీమా రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్‌లో యంగ్ స్టార్‌ ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అజేయ సెంచరీతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. పన్నెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె అండర్-19 క్రికెట్ సీజన్‌లో అరంగేట్రం చేసింది. దేశీయ 50 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా, ఆమెకు 2017-18 సీజన్‌కు గాను బీసీసీఐ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON