loader

ఆ పనులు వెంటనే స్టార్ట్ చేయండి..డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే తొలి 5 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా Nvidia..

Nvidia సంస్థ అరుదైన రికార్డును అందుకుంది. చరిత్రలోనే తొలిసారిగా ఐదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ సొంతం చేసుకున్న తొలి కంపెనీగా ఘనత సాధించింది. భారత్  జిడిపి ఐదు ట్రిలియన్ డాలర్లు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే, భారత్, యూకే, జపాన్ దేశాల జిడిపి లను సైతం వెనక్కు నెట్టి ముందుకు దూసుకొని వెళ్ళింది. ఈ ఐదు ట్రిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో మార్చినట్లయితే సుమారు 420 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. CEO జెన్సెన్ హువాంగ్ సగర్వంగా ఈ ఘనతను […]

తెలంగాణ ‘వాయుగండం’..! ఆరు జిల్లాలకు అతిభారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా వాయుగుండంగా బలహీనపడింది. ఆరుగంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మంకు 100 కిలోమీటర్లు, ఒడిశా మల్కాన్‌గిరికి 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా తుపాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో గ్లోబల్‌ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం McDonald’s తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్‌ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ప్రారంభం

నగర ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు విసి సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు.

‘నీ పిల్లల ముందే.. చంపేస్తా,’ నవనీత్ రాణాకు బెదిరింపులు

మహారాష్ట్ర బీజేపీ నేత, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు లేఖ వచ్చింది. స్పీడ్ పోస్టు ద్వారా వారి అమరావతి కార్యాలయ చిరునామాకు వచ్చిన లేఖతో తీవ్ర పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందులో అత్యంత అసభ్యమైన భాషను ఉపయోగిస్తూ, ప్రాణహాని,సామూహిక దాడి చేస్తామని హెచ్చరించారు. అలాగే, తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, హైదరాబాద్‌కు చెందిన జావేద్ అనే వ్యక్తి ఈ లేఖను పంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని జాడను […]

త్వరలో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా..

సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేనివారు ఎవరైనా కాల్ చేస్తే.. వారి నంబర్ మాత్రమే మనకు కనబడుతుంది. ఎవరో తెలియకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు టెలికాం విభాగం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి నంబర్ తో పాటు పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై కనిపించనుంది. సిమ్ (SIM) కొనేటప్పుడు యూజర్ ఏ ఐడెంటిటీ ప్రూఫ్స్ సమర్పిస్తాడో అందులో ఉన్న పేరే కనిపించనుంది.

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ- 51 మంది నక్సలైట్లు సరెండర్

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయేందుకు మావోయిస్టులు వరుస కడుతున్నారు. తాజాగా బీజాపుర్‌ జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 9మంది మహిళా సభ్యులు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈనెల 26న లొంగిపోయిన కాంకేర్ జిల్లాకు చెందిన 21మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.  13మంది మహిళా సభ్యులు, 8మంది పురుషులు ఉన్నారని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు. AK-47, SLR, ఇన్సాస్‌సహా 18ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు.

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగులు, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఓట్ల కోసం ప్రధాని భరతనాట్యం చేయమన్నా చేస్తారు : రాహుల్‌గాంధీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దర్భంగా ప్రచారసభలో రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో లబ్దిపొందడానికి ఏదో ఒక డ్రామా ఆడుతారని అయితే యమునా నదిలో స్నానం, కుంటలోకి స్వచ్ఛమైన నీళ్లను వదిలే పైపు ఫొటో బయటపడటంతో ఆ డ్రామా బెడిసికొట్టిందని, ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్‌ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్‌ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏకంగా భరతనాట్యమే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON