నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం ..డ్రైవర్ గల్లంతు
తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలో గల పల్లిపాడు -ఏన్కూర్ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని ఎంత చెప్పిన వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ నీటిలో గల్లంతు అయ్యాడు.

