loader

రహస్య సమావేశం, CIA కుట్ర, US ఆఫీసర్ హత్య

బంగ్లాదేశ్‌లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్(Terry Jackson) హత్య అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటన చుట్టూ తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం, CIA భారత ప్రధానమంత్రి మోదీని హత్య చేయాలని కుట్ర పన్నిందని, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకే భారత్, రష్యా సంయుక్తంగా చర్యలు తీసుకున్నాయని కథనాలు చెబుతున్నాయి. ఈ హత్యపై అమెరికా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలు విడుదల చేసినప్పటికీ, కుట్రల వాదనలు తగ్గడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై కసరత్తు!

తెలంగాణలో డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ లో కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కూడా హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం, స్థానిక డీసీసీలను సమర్ధవంతంగా నియమించడం ముఖ్య అంశాలుగా చర్చించబడ్డాయి.

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 30 కి వాయిదా

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ ఢిల్లీకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) నుంచి కొన్ని వివరణలు కావలసి ఉన్నందున విచారణ వాయిదా వేసినట్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే శనివారం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాదీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు […]

తుపాను నేపథ్యంలో ఏపీలో బీచ్‌లు మూసివేత, తిరుపతిలో పునరావాస ఏర్పాట్లు

తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని బీచ్‌లు, సూర్యలంక బీచ్‌తో పాటు చీరాల పరిధిలోని బీచ్‌లు సైతం మూసివేశారు. తుఫాను కారణంగా సోమవారం నుండి తాత్కాలికంగా మూసివేత ఉంటుందని, భక్తులు యాత్రికులు సముద్ర తీరానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తిరుపతిలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు అక్కడే వసతి, ఆహారం సదుపాయాలు ఏర్పాటు చేశారు. సాయం కొరకు 24 గంటలు టోల్ ఫ్రీ నంబర్లు 0877 – 2256776, […]

నందిగామ వద్ద కలకలం.. ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు…

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. విజయవాడ నుంచి కోదాడకు వెళ్తున్న బస్సు నందిగామ హైవే వద్దకు చేరుకునే సరికి ఇంజిన్‌ భాగం నుంచి పొగలు కక్కడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి, లోపలున్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఇంధన లీకేజీ కారణంగానే ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయని డ్రైవర్‌ తెలిపాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

విజయ్ సంచలన నిర్ణయం – ఇక రోడ్ షోలు బంద్

తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ తిరిగి పార్టీ ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరూర్ తొక్కిసలాట లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా విజయ్ రోడ్‌షోలను రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రచార శైలిని అనుసరించే లక్ష మందికి వసతి కల్పించగల ప్రాంతంలో నగరం వెలుపల జనాన్ని సమీకరించి.. విజయ్ హెలికాప్టర్‌లో వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

నేను, కోహ్లీ మ‌ళ్లీ ఆసీస్‌లో ఆడ‌తామో లేదో తెలియ‌దు..రోహిత్ శ‌ర్మ

హిట్ మ్యాన్ భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ..2008లో తాను తొలిసారి ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చాన‌ని, నాటి జ్ఞాప‌కాలు మ‌రిచిపోలేన‌న్నాడు. తాము (కోహ్లీ, రోహిత్‌) క్రికెట‌ర్లుగా మ‌ళ్లీ ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తామో లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా తాను ఇక్క‌డ ఆడిన ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంతో ఆస్వాదించాన‌ని తెలిపాడు. ఆసీస్ గ‌డ్డ‌పై ఆడ‌డం త‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఇష్ట‌మేన‌ని, కోహ్లీకి కూడా ఇలాగే […]

అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై ఎవరి ఒత్తిళ్లు లేవు: ఎల్‌ఐసీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై జీవిత బీమా సంస్థ స్పందించింది. ఈ పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ […]

ఆఫీసర్స్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేస్‌.. గుంటూరు కార్పొరేషన్‌లో

గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్ పులి శ్రీనివాస్‌కు.. లోకల్‌ అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులకు.. కమిషనర్‌కు మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇలా ఏ అంశంలోనూ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు వ్యాపారులకు సరైన సమాచారం ఇవ్వకుండా.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఎమ్మెల్యేల […]

చాదర్‌ఘాట్‌ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్‌

చాదర్‌ఘాట్‌ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్‌లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్‌ పరిశీలించారు. కాలాపత్తర్‌ రౌడీషీటర్‌ ఉమర్‌ సెల్‌ఫోన్‌ చోరీకి యత్నించాడని సజ్జనార్‌ తెలిపారు. పట్టుకునే సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని పేర్కొన్నారు. పరిస్థితి చేయి జారకుండా ఉండాలని డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని తెలిపారు. ఉమర్‌ ఎదురుతిరగడంతోనే కాల్పు జరిపామని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON