loader

పదేళ్ల రేసర్‌ భవితకు భరోసా.. ఫార్ములా వన్ అకాడమీ..!

కారు రేసింగ్‌లో అదరగొడుతున్న జమ్ము కశ్మీర్ బాలిక.. యువ రేసర్‌ అతీకా మిర్‌ కష్టాలు తొలగిపోన్నాయి. ట్రాక్ మీద అద్బుతాలు చేస్తున్న ఆమె గురించి తెలిసిన ఫార్ములా వన్ అకాడమీ సంస్థ ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిందీ సంస్థ. తద్వారా సాంకేతికంగా, ఆర్ధికంగా ఫార్ములా వన్ సహకారం అందుకున్న మొదటి భారత రేసర్‌గా అతీకా గుర్తింపు సాధించనుంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ ప్రభంజనం.. ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ

జమ్ము కశ్మీర్‌లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని పార్టీ మూడు సీట్లు గెలుపొందింది. అయితే.. అధికార పక్షానికి షాకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో చౌదరీ మొహమ్మద్ రంజాన్, సజద్ కిచ్లూ, పార్టీ కోశాధికారి జీఎస్ షమ్మీ ఒబెరాయ్‌లు […]

సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్‌లోని సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన చేసింది. ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో బాధితుల నుంచి రూ.842 కోట్లు వసూలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది

మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు..

తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్ల‌డించారు. గురువారం ఒక్క‌రోజే 4822 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. రంగారెడ్డి డివిజన్‌లో అత్య‌ధికంగా 29,420 ద‌ర‌ఖాస్తులు రాగా, అదిలాబాద్ డివిజన్‌లో అత్య‌ల్పంగా 4154 ద‌ర‌ఖాస్తులు వచ్చాయి. మ‌ద్యం దుకాణాల‌కు ఈ నెల 27వ తేదీన డ్రా నిర్వ‌హించ‌నున్నారు. 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రా తీయనున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

వేమూరి కావేరి ట్రావెల్స్ ఘరానా మోసం -బాధితులకు బీమా సౌకర్యం కూడా కష్టమే!

బస్సు దగ్ధం ఘటనలో కాలిబూడిదై 19 మందిని పొట్టనపెట్టుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్​ బస్సు అక్రమ బాగోతం బయటపడింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్‌ క్యారీయర్‌యే కానీ స్లీపర్‌ సర్వీస్‌ ఎంత మాత్రం కాదు. వాస్తవ పర్మిషన్‌ విరుద్ధంగా బస్సు ఫిట్​నెస్‌ను మార్చి సీటింగ్‌ క్యారీయర్‌ పర్మిషన్‌ను స్లీపర్‌ క్యారీయర్‌గా మార్చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్‌ సంస్థలు చేస్తున్న అక్రమ దందా మూలంగా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కనీసం పరిహారం కూడా దక్కడం […]

అడవుల పరిరక్షణలో రాజకీయాలకు తావుండదు..పవన్‌ కల్యాణ్‌

కృష్ణా జిల్లా కొండపావులూరులోని NDMA ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్‌లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు. కబ్జా అయిన అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక […]

కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇవాళ(శుక్రవారం) బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యారని కావేరి బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై 125/Aతో పాటు మరికొన్నిసెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆ బస్సుకి చెందిన ఒక డ్రైవర్ శివ నారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతదేహాలు లభ్యం

తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి గురయ్యారు. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడగా.. నలుగురు గల్లంతయ్యారు. వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుల్లో ప్రకాశ్‌, చిన్నా, తేజూ, బాలు గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు గల్లంతైన ఇద్దరు యువకుల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి భేటీ జరిగింది. దాదాపు రెండు గంటలపాటు వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో హైడ్రా వంటి ఒక వ్యవస్థ మంచిదే అని గతంలో పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON