loader

మోటాలో భారీగా ఉద్యోగుల తొలగింపు..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన మెటా సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం నుండి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2025లో తీసుకోవడం ద్వారా, మెటా తన కార్యకలాపాలను వేగవంతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. US మీడియా, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు న్యూయార్క్ టైమ్స్, ఈ విషయాన్ని వివరించారు.

మంధాన సూపర్ క్యాచ్.. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్‌

భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. రికార్డు ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెడుతూ వికెట్లు తీస్తున్నారు. టాపార్డర్ కుప్పకూలిన వేళ.. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అమేలియా కేర్( 45) సైతం ఔటయ్యింది. సాధించాల్సిన రన్‌రేటు 9కి చేరడంతో పెద్ద షాట్లు ఆడబోయిన అమేలియా.. స్నేహ్ రానా ఓవర్లో మిడాన్‌లో బౌండరీకి యత్నించింది. అక్కడే ఉన్న స్మృతి మంధాన జంప్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. అంతే.. జట్టు స్కోర్ 100 దాటించిన జోడీని విడదీసింది రానా.

అమెరికాలో ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి..

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జస్ప్రీత్ సింగ్ మద్యం మత్తులో ట్రక్కు నడుపుతున్నాడని,బ్రేక్‌లు కూడా వేయలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడైన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. జస్ప్రీత్ సింగ్‌కు అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఇమ్మిగ్రేషన్ హోదా లేదని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్ధారించింది. అతను 2022లో దక్షిణ సరిహద్దు […]

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్ష ఫీజు చెల్లింపు తేదీల‌ను డైరెక్ట‌ర్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 30వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 13వ తేదీలోగా ఆయా స్కూళ్ల హెడ్‌మాస్ట‌ర్ల‌కు విద్యార్థులు ఫీజు చెల్లించాల‌ని తెలిపింది. హెచ్ఎంలు ఆన్‌లైన్ ద్వారా న‌వంబ‌ర్ 14వ తేదీలోగా ఫీజు చెల్లింపు చేయాల‌ని, విద్యార్థుల డేటాను న‌వంబ‌ర్ 18 లోపు డీఈవోల‌కు అందించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు,రూ. 200తో డిసెంబ‌ర్ 2 నుంచి 11 […]

రాజస్థాన్‌ అధికారి చెంపదెబ్బ వివాదంలో.. నకిలీ భార్య ట్విస్ట్

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పెట్రోల్‌ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నకిలీ భార్య అన్నది వెలుగులోకి వచ్చింది. పెట్రోల్‌ బంకులోని ఒక సిబ్బంది తనను చూసి కన్నుగీటి అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్లు ఆరోపించింది. దీంతో తన భర్త అయిన ఎస్డీఎం జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

భారీ మెజారిటీ కోసం ప్రయత్నించండి.. : బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్

కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని చెప్పుకొచ్చారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ […]

శతక్కొట్టిన ప్రతీక, మంధాన, జెమీమా రోడ్రిగ్స్…

చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. జెమీమా రోడ్రిగ్స్(76 నాటౌట్) విధ్వంసక హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారిద్దరూ. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 49వ ఓవర్లకు కుదించగా.. జెమీమా, రీచా ఘోష్‌(4 నాటౌట్) చెరొక బౌండరీ కొట్టడంతో.. టీమిండియా ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

డిప్యూటీ సీఎం Vs డిప్యూటీ స్పీకర్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినని పేర్కొంటూ, డీఎస్పీ అంశంపై పవన్ అభిమానులు తనను అపార్థం చేసుకుంటున్నారని వాపోయారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై తనకు అందిన సమాచారం తప్పై ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రఘురామకృష్ణ రాజు ఆశాభావం డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అంటూ పలు థంబ్‌నెయిల్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్‌లో […]

ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత – కేబినెట్ నిర్ణయం

మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ను ఎత్తివేయాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించాలని ఆమోదం తెలిపింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను ఎత్తివేయడంతో, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసే అవకాశం కలుగుతుంది.  కేబినెట్ నిర్ణయం మేరకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. […]

సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన

అబుదాబీలో అల్ మైరాహ్ ఐలాండ్‌లోని ఏడీజీఎ స్క్వేర్‌లో ఏడీఎన్‌ఓసీ గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పెట్రోకెమికల్‌, ఇంధన, ఎల్‌ఎన్‌జీ‌, గ్యాస్‌ ప్రాసెసింగ్‌, పోర్ట్‌ లాజిస్టిక్స్‌, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలు గురించి చర్చించారు. అబుదాబీ చాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ 42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON