loader

తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు…

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా బీసీ సంఘాలు జరపనున్న రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. వివరాలు… అక్టోబర్ 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీసీ సంఘాల నేతలు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో ఓబీసీ సంక్షేమ శాఖ ఉండాలని కోరిన ఏకైక తొలి నాయకుడు కేసీఆర్ అని […]

బిహార్‌లో 12 మందితో బీజేపీ రెండో జాబితా..

బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 12 మందితో రెండో జాబితా విడుదల చేయగా.. వీరిలో ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాలకు అవకాశం కల్పించింది. సింగర్ మైథిలీ అలీనగర్ నుంచి, ఆనంద్ మిశ్రా బక్సార్ నుంచి పోటీచేయనున్నారు.  ఈ జాబితాలోని 12 మందిలో 9 మంది కొత్త ముఖాలు కావడం విశేషం.

ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ నిబంధనలు అక్టోబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి మద్యం బాటిల్‌పై జియో-ట్యాగ్ చేసిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. షాపుల్లో అమ్మే ముందు ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. మద్యం షాపుల లైసెన్స్ హోల్డర్లు స్కానింగ్ ప్రక్రియను అనుసరించకపోతే, లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తారు. జియో-ట్యాగింగ్ వల్ల బాటిళ్లు నిర్దేశిత ప్రాంతాల్లో […]

ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. క్లాస్‌మేట్ అరెస్ట్‌

ఇంజినీరింగ్ విద్యార్థినిని క్లాస్‌మేట్ అత్యాచారం చేశాడు.ఆమె రూమ్‌కు వెళ్లి మత్తుమందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ కోల్‌కతాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నది. బెంగాల్‌లోని మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడం కలకలం రేపింది.

రేపు శృంగేరి మ‌ఠానికి రానున్న‌ శ్రీ విధూషేక‌ర భార‌తీ స్వామి..

శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆశీరనుగ్రహంతో వారి ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్యు శ్రీ విధూషేకర భారతీ స్వామివారు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 16న ధర్మ విజయ యాత్రకు విచ్చేస్తున్నారు. అటు తరువాత ఉత్తర తెలంగాణలోని బాసర, వేములాడ వంటి పుణ్య క్షేత్రాల దర్శనం, వివిధ దేవాలయాల్లో కుంభాభిషేకాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 21-28 తేదీల మ‌ధ్య‌లో నల్లకుంటలో గల శృంగేరి శంకరమఠంలో, న‌వంబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు సైనిక్‌పురి శృంగేరి శంకర మఠం […]

రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

కేసీఆర్ ఫోటో లేకుండానే.. కవిత జిల్లాల యాత్ర.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత.. కాస్త విరామం తీసుకుని కల్వకుంట్ల కవిత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఆమె తొలిసారిగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర సాగించనున్నారు. కేసీఆర్ బదులుగా ఈ ప్రచారంలో ప్రొఫెసర్ జై శంకర్ ఫోటోను ఉపయోగిస్తారని సమాచారం. ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్టు’ ఆమె అన్నారు. ఇద్దరు దారులు వేరన్నప్పుడు తన దారి తాను చూసుకోవాలని కవిత చెప్పారు.

2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఎంపిక..

2030 శతాబ్ది కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది. గత 20 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఈ క్రీడలు జరగడం ఇది రెండోసారి. నిర్వాహక సంస్థ కామన్వెల్త్ స్పోర్ట్ కమిషన్, నైజీరియాలోని అబూజా కంటే భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అహ్మదాబాద్ నగరాన్ని ఆతిథ్యం కోసం ఎంపిక చేసింది. ఐదేళ్లలో జరగనున్న ఈ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించాలనే ఈ నిర్ణయం, నవంబర్ 26న గ్లాస్గోలో జరగనున్న సంస్థ జనరల్ అసెంబ్లీలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON