loader

కెసిఆర్ దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు, దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా.. విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు.

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి పర్వదినం సందర్భంగా  తెలుగు ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా సందేశం పంచుకున్నారు. దసరా పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయ విలువలను గుర్తుచేస్తూ, ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

దగ్గు సిరప్ వల్ల ఇద్దరు పిల్లలు మృతి.. సురక్షితమని నిరూపించబోయి మూర్ఛబోయిన డాక్టర్‌

ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్‌ ఆ సిరప్‌ తాగిన తర్వాత స్పృహ కోల్పోయాడు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. కేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సమ్మేళన దగ్గు సిరప్‌ను ప్రభుత్వ హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తున్నారు.

సోషల్ మీడియాపై యుద్ధం.. చంద్రబాబు సర్కార్ సరికొత్త వ్యూహం..

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం.. మంత్రులు లోకేష్, సత్యకుమార్, హోమ్, పార్థసారథి, నాదెండ్ల మనోహర్ లు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ […]

రేవంత్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఉద్యోగులపై లేదు : హ‌రీశ్‌రావు

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలను రేవంత్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఉద్యోగులపై లేదు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు […]

బ్రహ్మోత్సవాల చివరి రోజు చ‌క్రస్నానం ఏర్పాట్లను తనిఖీ చేసిన‌ టీటీడీ ఈవో

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చ‌క్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు చేశారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీ ఎస్వో కె.వి.మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాల‌ని, […]

హిందూ ధర్మానికి నేను వ్యతిరేకం కాదు.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల

దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించి, తన వాదనను వివరించారు. హిందూ ధర్మానికి, మతానికి తాను కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా […]

ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్…

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(HCL) టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. M3M హురున్ ఇండియా విడుదల చేసిన జాబితాలో2025లో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్నీ నాడార్ నిలిచింది, ఇండియాలోనే టాప్ 10 కుబేరుల జాబితాలో ఈమె అతి పిన్న వయస్కురాలు. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు.

రేపే విజయవాడలో దసరా ఉత్సవాలు ముగింపు.. తెప్పోత్సవం రద్దు..

విజయవాడలోని ఇంద్రకీల్రాదిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన విజయదశమి నాడు దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమివ్వనున్నారు. సాయంత్రం జరిగే తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే, ఈ ఏడాది హంసవాహన తెప్పోత్సవం లేకుండానే ఉత్సవాలు ముగయనున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో తెప్పోత్సవం రద్దు చేశారు.

భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంచం – చంద్రబాబు

విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను పెంచే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు ‘ట్రూ అప్’ ఛార్జీల రూపంలో ప్రజలపై భారాన్ని మోపారని, కానీ తాము ఆ భారాన్ని తగ్గిస్తూ విద్యుత్‌ ఛార్జీలను క్రమంగా తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది వినియోగదారులకు ఊరట కలిగించడమే కాకుండా పరిశ్రమలకు కూడా ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON