loader

బతుకమ్మ కుంట పేరు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో దశాబ్దాల పోరాటానికి, సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బతుకమ్మ కుంట పూర్వవైభవం సంతరించుకుంది. అత్యంత కీలకమైన పరిణామంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుంటకు ‘వి. హనుమంతరావు బతుకమ్మ కుంట’అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 35 సంవత్సరాల పాటు కబ్జాదారుల నుండి ఈ కుంటను కాపాడటానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన వి. హనుమంతరావు కు దక్కిన గౌరవం ఇది

‘మైటా’ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగింది. సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి భారత హై కమీషనర్ బీఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత పన్నెండు సంవత్సరాలుగా మలేషియాలో ‘మైటా’ చేస్తున్న సహకార కార్యక్రమాలను, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న పండుగలను కార్యక్రమాలను ఆయన అభినందించారు. 150 పైగా బతుకమ్మలు పేర్చి ఆడడం, 2,000లకు పైగా మంది సమూహంతో చిన్నపాటి తెలంగాణను తలపిస్తుంది అని బీఎన్‌ రెడ్డి కొనియాడారు.

గ్రూప్- 2 ఫలితాలు విడుదల

రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది.2022 నోటిఫికేషన్‌కు సంబంధించిన గ్రూప్ -2 పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్‌సి) ఆదివారం ప్రకటించింది. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, వైద్య పరీక్షలు పూర్తి చేసింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, మెరిట్ ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించింది.

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో ప్రధాని మోదీ మర్యాదపూర్వక భేటీ

దేశ రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి… ఆయన నివాసం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ వద్ద కలసి శుభాకాంక్షలు తెలిపారు. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేడు గౌరవనీయ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు” అని పోస్ట్‌లో పేర్కొంది. ప్రధాని మోదీ కూడా ఈ భేటీ గురించి ట్వీట్ […]

‘ఆడబిడ్డల సంతోషం..బతుకమ్మ పండుగకు నిండుదనం’: సీఎం రేవంత్ రెడ్డి

ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబర్‌పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం.. చెరువులో బతుకమ్మలు వదిలి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబర్‌పేట మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘కాంతార చాప్టర్ 1’పై NTR ప్రశంసల జల్లు

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన రిషబ్, టీంపై ప్రశంసలు కురిపించారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఊరి కథలు చెప్పేవారని… అలాంటి కథలతో ‘కాంతార’ను తెరకెక్కించి రిషబ్ శెట్టి అద్భుతం చేశారని నేను విన్న ఆ కథల గురించి ఓ దర్శకుడు ఓ మూవీ తీస్తాడని. అది నిజం చేశారు నా సోదరుడు రిషబ్ శెట్టి. ‘కాంతార’ను చూసి నాకు నోట మాట రాలేదు అని అన్నారు ఎన్టీఆర్. […]

విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్.. మొత్తం ఇంటర్నెట్‌ షేక్..

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. సోషల్‌మీడియాలో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంటాడు. తాజాగా విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. తన భార్య అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత’ అంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

ఆయన పాక్ వెళ్లింది అందుకే, పైగా మోదీని పొడిగారు… వాంగ్‌చుక్ భార్య వెల్లడి

లద్దాఖ్‌లోని లెహ్ లో జరిగిన హింసాకాండ కు భద్రతా బలగాలే కారణమని ఘటన అనంతరం అరెస్టయిన పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో ఆరోపించారు. తన భర్తకు పాక్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. పూర్తిగా వృత్తిరీత్యా, వాతావరణ అంశాలపై డిస్కషన్ కోసం వాంగ్‌చుక్ పాక్ వెళ్లారని, ఆయన జరిపిన పర్యటలన్నీ ప్రఖాత్య యూనివర్శిటీలు, సంస్థల ఆహ్వానం మేరకే జరిగినట్టు చెప్పారు ‘నిజానికి, ఆ ఈవెంట్‌లో వేదికపై ప్రధానమంత్రి మోదీని ఆయన […]

కిక్కిరిసిన తిరుమల కొండ.. ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ

తిరుమల శ్రీవారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడ వాహనసేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సాంప్రదాయ వాహనసేవకు ఉన్న ప్రత్యేకత కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పటికే 4 వేల వాహనాలతో తిరుమలలో పార్కింగ్ ప్రాంతాలు నిండిపోవడంతో ప్రైవేట్ వాహనాలను అలిపిరి వద్దే ఆపివేస్తున్నారు. భక్తులు RTC బస్సుల ద్వారానే తిరుమలకు వెళ్లేలా అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక […]

హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ బాస్‌ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడడంలో ఎవరైనా భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. కొత్తగా నియమితులైన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలోని రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ప్రజల రక్షణే మా ప్రధాన లక్ష్యం. చట్టం ఎవరికైనా ఒకటే. రౌడీషీటర్లు శాంతి భద్రతల్ని భగ్నం చేయాలని చూస్తే వారిపై పీడీ యాక్ట్‌లు అమలు చేస్తాం. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON