loader

కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. తద్వారా అనేక ఉత్పత్తులపై ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు జీఎస్టీ 2.0కి సంబంధించిన జీవోలను సీఎం విడుదల చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్టీకి సంబంధించి తెలుగు జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు.

నేను డిప్యూటీ సీఎం అనే సంగతే మర్చిపోయా: పవన్ కళ్యాణ్

ఓజీ సినిమాలో పోషించిన ఓజాస్ గంభీర గెటప్ లో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు వచ్చారు. సినిమాలో ఉపయోగించిన పెద్ద కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చారు. ‘వాషి యో వాషి’ అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయానని, అందుకే ఇలా కత్తి పట్టుకొచ్చానని అన్నారు. సుజిత్ వల్ల ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సినిమా గెటప్ లో […]

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూకే, కెనడా

చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా ఆదివారం నాడు అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ యూకే, కెనడా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు ‘సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా’ ఏర్పాటు కీలకమని పేర్కొంది.

‘నా కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతా’: కవిత హాట్ కామెంట్స్

తనను కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర పన్నిన వారిని వదలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తల్లిని, తండ్రిని కాకుండా వేరు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కవిత తన స్వగ్రామం చింతమడకలో గ్రామస్తులతో కలిసి నేడు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు చింతమడక శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.

టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆసియా కప్‌ భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకోలేదు.

వేయి స్తంభాల గుడిలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు..

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల గుడి వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి పాల్గొన్నారు. వందలాది మంది మహిళలు, బాలికలు ఇందులో పాల్గొన్నారు. తీరొక్క పువ్వులు, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, కట్లపువ్వులతో అలంకరించిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కొరియా షట్లర్ల జోరు.. సాత్విక్ జోడీకి వరుసగా రెండో రజతం

భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్‌ లోనూ కంగుతిన్నది. దక్షిణకొరియాకు చెందిన టాప్ సీడ్ సియో సూయెంగ్ జే – కిమ్ వొన్ హో జోడీకి బదులివ్వలేక వెండి పతకంతోనే సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ – చిరాగ్ జంట 19-21, 15-21తో ఓటమి పాలైంది.

జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గింపుతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా: ప్రధాని మోదీ

జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గింపు వల్ల ప్రజలు గతంలో రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేసుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాజా జీఎస్టీ 2.0 సంస్కరణలతో వ్యాపారాలు సులభతరం అవుతాయని, పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నవరాత్రి తొలిరోజు నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుందని..ఇది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తుందని ప్రధాని అన్నారు.

తెలంగాణ జిల్లాలకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..

తెలంగాణ జిల్లాలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కాసేపట్లో వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.

హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు ప్రకటన ఎన్నారైలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిబంధనల్లో అస్పష్టత, వెంటనే అమెరికాకు తిరిగి రావాలంటూ ఎన్నారైలకు టెక్ కంపెనీల పిలుపు కారణంగా భారతీయులు అనేక మంది నానా రకాల ఇబ్బందులు పడ్డారు. సెలవులకు ఇండియాకు వచ్చిన భారతీయులు సహా వివిధ దేశాల్లోని ఎన్నారైలు అమెరికాకు క్యూకట్టారు. 4Chan ఆన్‌లైన్ ఫోరమ్ యూజర్లు కొందరు విమాన టికెట్లను బ్లాక్ చేసి భారతీయులకు టిక్కెట్ల దొరకకుండా చేశారని తెలుస్తోంది. టిక్కెట్లు కొంటామంటూ వాటిని రిజర్వ్‌లో పెట్టి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON