దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్..
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్ నిర్వహించనుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముగిసే ఈ దేశవ్యాప్త ఉద్యమం స్వచ్ఛత హి సేవ (SHS) 2025తో సమన్వయం చేయబడుతుంది. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన దేశం కోసం మంత్రిత్వ శాఖ నిబద్ధతను బలోపేతం చేస్తూ శాస్త్రి భవన్, జీవన్ తారా భవనంలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ చేపట్టనున్నారు.