loader

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం జరిగే ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికే ఆయన ఈ పర్యటన చేశారు.చంద్రబాబు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ బయలుదేరారు. ఆయన రాకతో ఢిల్లీ టీడీపీ నేతలు, మిత్ర పక్ష నాయకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు

ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం…కొత్త కలెక్టర్లతో సీఎం

్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. సమర్థవంతమైన పాలన అందించే విషయంలో వారికి దిశా నిర్థేశం చేశారు. అందుబాటులో ఉండండి…. నిత్యం వారితో మమేకం అవ్వండి… అన్నింటికీ రూల్స్ కాదు… మానవీయ కోణంలో పనిచేయండి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సిఎం చంద్రబాబు నాయుడు […]

హాంకాంగ్ ఓపెన్ 2025.. క్వార్టర్ ఫైనల్‌కు ఆయుష్, లక్షసేన్

ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, లక్షసేన్‌లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో జయభేరి మోగించి ముందంజ వేసింది. గురువారం జరిగిన సింగిల్స్ పోరులో ఆయుష్ 21-19, 12-21, 21-14తో ప్రపంచ 9వ ర్యాంక్ ఆటగాడు నరకొరా (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. లక్షసేన్ హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన ప్రణయ్‌ను […]

వారిని తక్షణమే ఇళ్ల నుంచి ఖాళీ చేయించండి.. సీఎం కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రతి అధికారిని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లల్లో నివసించే కుటుంబాలను వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే కాజ్‌వేలు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునే నిర్మాణాలను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

మాకు న్యాయం చేయండి సారూ.. ఎమ్మెల్యే కు భూ బాధితుల వేడుకోలు

గౌరెల్లి నుండి భద్రాచలం వరకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేక‌రించిన భూముల‌కు బహిరంగ మార్కెట్ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలంటూ భూ బాధితులు డిమాండ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఒక్క ఎకరానికి కోటి రూపాయలకు పైగా బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతుందని, ప్రభుత్వం ఎకరానికి రూ. 24 లక్షలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. త్రిబుల్ ఆర్ కింద ఎకరానికి రూ.47 నుండి 50 లక్షలు చెల్లిస్తుందని బాధితులు భువ‌న‌గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి వ‌ద్ద […]

నాకొడుకు రాజారెడ్డి వైఎస్ఆర్ వారసుడు…ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నా కొడుకు వైఎస్ రాజారెడ్డి వైఎస్ఆర్ వారసుడు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఎన్ని కుక్కలు మెురిగినా దీన్ని మార్చలేరని అన్నారు. YCP సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి నే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేరు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నా కొడుకుని చంద్రబాబు నాయుడు చెప్తే రాజకీయాల్లోకి తీసుకువస్తే…. మీరు ఎవరు […]

నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఏపీ వాసులు

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నారా లోకేష్ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ముందుగా నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులతో కమ్యూనికేట్ అయి.. వారందర్నీ ఖాఠ్మాండూ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తీసుకు వచ్చారు. 144 మందితో విమానం బయలుదేరుతున్న వీడియోను నారా లోకేష్ షేర్ చేసారు. ఇండిగో విమానం విశాఖపట్నం , తిరుపతికి బయలుదేరింది. 36 గంటల కృషితో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం విలువైనదిగా చేసిందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్ట్‌లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నారని భద్రతా దళ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం తెలంగాణ కావడం గమనార్హం. ఇతడిపై కోటి రూపాయల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు.ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్‌ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ […]

కుప్ప‌కూలిన పాత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షాల‌కు పాత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. పాత భవనంలో కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖలు పనిచేస్తున్నాయి. ట్రెజరీ కార్యాలయంలోని పాతబడిన పైకప్పు భారీ వర్షానికి ఒక్కసారిగా విరిగిపడింది. ట్రెజరీ కార్యాలయం ముందు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కార్యాలయం ఆవరణలోని ర్యాకులపై పైకప్పు పడ‌డంతో అందులోని ఫైల్ సైతం ధ్వంస‌మ‌య్యాయి.

రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్‌ పాటించడం లేదు..

విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) లేఖ రాసింది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకూ CRPF లేఖ రాసింది. లేఖలో రాహుల్ గాంధీ తన భద్రతను సీరియస్‌గా తీసుకోవడం లేదని సీఆర్‌పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూన్ ఆరోపించారు.ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్, లండన్, మలేషియా వంటి దేశాల్లో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఆయన పర్యటించారని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON