loader

మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ శుభారంభం

మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పోరులో భారత మహిళా టీమ్ 11-0 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది.  ఇందులో విజేతగా నిలిచే టీమ్ బెల్జియం వేదికగా జరిగే మహిళల ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తోంది. ముంతాజ్ ఖాన్ ఏడో నిమిషంలోనే తొలి గోల్ చేసింది. 49వ నిమిషంలో ముంతాజ్ తన రెండో గోల్‌ను సాధించింది.ఉదిత, బ్యూటీడంగ్ డంగ్‌లు కూడా రెండేసి గోల్స్ చేశారు. దీంతో భారత్ […]

నేను అక్కడి వరకు వెళ్లానంటే కారణం నా టీచర్లే : లోకేశ్

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన విద్యార్థి దశను గుర్తుచేసుకున్నారు. తాను ఓ బ్యాక్ బెంచర్‌నని, అలాంటి తనను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరకు తీసుకెళ్లింది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో గురుపూజోత్సవ వేడుక లను వైభవంగా నిర్వహించింది. ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు […]

ముంబైకి హై అలర్ట్

అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జన ఉత్సవంకోసం ముంబై మహానగరం సన్నద్ధమవుతున్న వేళ, బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు సందేశం రావడంతో నగరం ఉలిక్కిపడింది 34 కార్లలో మానవబాంబులను విధ్వంసం సృష్టించేందుకు సిద్ధం చేశామని, అది మొత్తం నగరాన్ని అల్లకల్లోలం చేస్తుందని ఆ బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు. ముంబై నగరంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి బేస్ మెంట్ ల వరకూ తనిఖీ చేస్తున్నారు. భద్రతా దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా దీటుగా […]

నాకంటే వేరే రాష్ట్రం మెరుగ్గా ఉంటే నేను తట్టుకోలేను…టీచర్ల బాధ్యత నాదే : సీఎం

‘టీచర్ల బాగోగులు చూసుకునే బాధ్యత నాది… విద్యార్థుల బాధ్యత టీచర్లది.. భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘నాకంటే వేరే రాష్ట్రం మెరుగ్గా ఉంటే నేను తట్టుకోలేను. ఎప్పుడూ రాష్ట్రాన్ని నెంబర్-1గా ఉండాలనే కోరుకుంటున్నాను. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేశారు.‘పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా చదివిస్తే ఊహించనంత ఎత్తుకు ఎదుగుతారు, అని సీఎం చంద్రబాబు […]

మేము రాగానే చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయాలు రద్దు.. వైఎస్ జగన్

సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పెట్టిన 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మంత్రివర్గ సమావేశంలో.. ప్రైవేటు పరం చేయడం అవినీతికి నిదర్శమని కాలేజీలు రావడంతో.. ఆ ప్రాంతంలో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి చంద్రబాబు ఇలా ప్లాన్ చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. పేదలకు ద్రోహం చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తాము అధికారంలోకి […]

టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌.. ఎఫ్‌ఐఆర్ నమోదు..!

ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్ పెరగడంతో మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించేందుకు కొందరు బుకీలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కాశీ రుద్రాస్ ఫ్రాంచైజీ యజమాని అర్జున్ చౌహన్‌కు ఒక బుకీ (Bookie) ఏకంగా భారీగా డబ్బులు ఆఫర్ చేశాడు. తాను చెప్పినట్టుగా చేస్తే రూ.1 కోటి ఇస్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దాంతో.. సదరు బుకీపై అర్జున్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]

మ‌హిళా రైతుల యూరియా తిప్ప‌లు.. ఇదిగో జ‌ర చూడండి సీఎం గారు..

తెలంగాణ రైతాంగం ప‌ట్ల నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. యూరియా కోసం మ‌హిళా రైతులు ప‌డుతున్న తిప్ప‌ల‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. క‌నిపిస్తుందా.. వినిపిస్తుందా.. గౌర‌వ ముఖ్య‌మంత్రి గారూ.. మీ పాలనలో అందరీలాగే మహిళ రైతులకు కూడా ఇబ్బందులేనా..? ఇదిగో జ‌ర చూడండి అని యూరియా కోసం మ‌హిళ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు స‌బితా ఇంద్రారెడ్డి.

లెక్చరర్‌గా కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పా

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేమన్నారు. తాను కూడా టీచర్ కావాల్సిందన్నారు. లెక్చరర్‌గా చేరాలని యూనివర్సిటీ వీసీ తనను కోరారని తెలిపారు. లెక్చరర్‌గా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయనకు తెలిపానని చెప్పారు.

రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా మారం ప‌విత్ర అవార్డు స్వీక‌ర‌ణ‌

సూర్యాపేట జిల్లా పెన్‌ప‌హాడ్ మండ‌ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు మారం ప‌విత్ర జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన విష‌యం తెలిసిందే. 2025 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 44 మంది ఎంపికవ‌గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు మారం పవిత్ర. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీక‌రించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON