loader

ఉచిత కరెంట్ అంటే.. వైఎస్ పేరు గుర్తుకు వస్తుంది-సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారని తెలిపారు. ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొని మీడియాతో మాట్లాడారు.

దిగొచ్చిన ప్రభుత్వం.. ముగిసిన మనోజ్ జరాంగే ఆందోళన

మరాఠాలకు ఓబీసీ కేటగిరి కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే మంగళవారం తన దీక్ష విరమించారు. తన డిమాండ్లలో అత్యధిక శాతాన్ని నేరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించిందని ఆయన తెలిపారు. మరాఠాలోని అర్హులైన కున్బీలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు.

సర్కార్ కీలక నిర్ణయం.. వరద సాయం కింద రూ.200 కోట్లు విడుదల

తెలంగాణ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, భవనాలకు నష్టం వాటిల్లింది. తెలంగాణ ప్రభుత్వం వరదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు అత్యవసర సాయం కింద రూ.200 కోట్ల నిధులను మంజూరు వరదలతో భారీగా నష్టాన్ని చవిచూసిన 7 జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున మిగిలిన 26 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ […]

సుగాలి ప్రీతి కేసులో సీబీఐకు లేఖ- ప్రభుత్వం నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంటపెట్టిన పవన్ కళ్యా్ణ్ ఫ్లెక్సీ..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి. గన్నవరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమను కళ్యాణ్ సీమ అంటూ ఉన్న ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అంతేగాక వాటిపై మీరెంత‌.. మీ స్థాయి ఎంత‌.. రోడ్ల మీద పండేస్తాం.. కొడ‌కల్లారా అంటూ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో దళిత సంఘాలు ఆగ్రహిస్తూ.. వాటిని చించేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ..

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌‌ తరువాత పార్టీ తీసుకోవాల్సీన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ఉద్యోగం, పొలం, స్థలం అన్నీ ఇచ్చేస్తా.. నా కూతుర్ని తెచ్చివ్వగలరా?

ఏపీలో సుగాలి ప్రీతి కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. సుగాలి ప్రీతి కేసు విషయమై బాధితురాలి ఇంటికి DyCM పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని పేపర్లో ప్రకటన వచ్చిందని.. కానీ సీఎం చంద్రబాబును సెక్రటేరియట్లో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆ పర్యటన రద్దైందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఉద్యోగం, 8 లక్షల 20 వేలు వెనక్కి ఇచ్చేస్తానని.. తన కూతుర్ని బతికించి ఇస్తారా అని […]

నిలిచిపోయిన జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ ఉత్పత్రి, అమ్మకాలు!

మంగళవారం జరిగిన ఒక సైబర్ సంఘటన కారణంగా ఉత్పత్తి, అమ్మకాల కార్యకలాపాలలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని జాగ్వార్ యజమాని JLR నివేదించింది. వినియోగదారుల డేటాకు ఎటువంటి రాజీ పడకుండా నివేదించడం ద్వారా కంపెనీ తన అన్ని వ్యవస్థలను మూసివేయడం ద్వారా ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్య తీసుకుంది. “ఈ దశలో కస్టమర్ల డేటా చోరీ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు, కానీ మా రిటైల్, ఉత్పత్తి కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి” అని ప్రకటన పేర్కొంది.

కాలువలో కాలుజారి పడి వదినా, మరదలు మృతి

కాకినాడలోని ఏలేశ్వరంలో ఏలేరు కాలువలో కాలుజారి పడి వదినా, మరదలు మృతి చెందారు. బట్టలు ఉతటానికి ఏలేరు కాలువ దగ్గరికి పెండ్ర లక్ష్మి, కుమారి వెళ్లారు. ప్రమాదవశాత్తు కుమారి కాలు జారి పడిపోయింది. కుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వదిన లక్ష్మి కూడా నీటిలోకి దూకింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మునిగిపోయి నీళ్లల్లో గల్లంతయ్యారు. స్థానికులు ఇద్దరిని బయటకు తీశారు. వెంటనే హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కానీ అప్పటికే వారు మృతి […]

అందుకే కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు.. సత్యవతి రాథోడ్

కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీడియా ముందుకు వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారు కాబట్టే కవితను హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి సత్యవతి రాథోడ్.. కవిత సస్పెన్షన్ గురించి స్పందించారు. పేగు బంధం కంటే.. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కోట్ల మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON