loader

ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రి నారాయణ, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

శ్రీశైలం, SRSPకి భారీ వరద

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ వరద ప్రవాహం శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల జలకళను పెంచింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 10 స్పిల్‌వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు, ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు […]

తెలంగాణ ప్రజలారా బిఅలర్ట్ ..పొంచివున్న ప్లాష్ ప్లడ్ ముప్పు

హైదరాబాద్ తో సహా పలు జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి… ఇవి రేపు (ఆగస్ట్ 28, గురువారం) కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది… తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో గురువారం భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట… అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇలా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇంకోరోజు కుండపోత వానలు తప్పవట… కాబట్టి ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం – కేటీఆర్

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ప్రజల కష్టాలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్ స్తంభాలు, వైర్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వినాయక పండుగ కార్యక్రమాలలో కూడా విద్యుత్ సిబ్బంది సహకారం తీసుకోవాలని, అనాలోచితంగా విద్యుత్ వైర్ల కింద నుంచి విగ్రహాలను తీసుకెళ్లవద్దని సూచించారు. వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్ మృతి చెందడంపై లాంటి విషాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన […]

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గల్లంతు..!

రాజస్థాన్‌లో కనఖేడాకు చెందిన కుటుంబం భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. తిరిగివచ్చే క్రమంలో గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళే మార్గాన్ని సెర్చ్ చేశారు. ఆ మ్యాప్ వారిని సోమి-ఉప్రెడా కల్వర్ట్ వైపు మళ్లించింది. అది చాలా రోజులుగా మూసివేసిన మార్గాన్ని సూచించింది. పొరబడిన డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్‌ మీదుగా తీసుకెళ్లాడు, బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు. ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి […]

వర్ష బీభత్సం.. డేంజర్‌లో పోచారం డ్యామ్‌..

భారీ వర్షాలు, వరదలతో పోచారం డ్యామ్‌ డేంజర్‌లో పడింది. పోచారం డ్యామ్‌కు వరద పోటెత్తడంతో.. డ్యామ్‌ పక్కనుంచి వరద ప్రవహిస్తోంది. కట్టతెగే ప్రమాదం పొంచి ఉందని.. అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రి వరద పోటు మరింత పెరగనుంది. పోచారం డ్యామ్‌ కట్ట తెగితే, పరిసరాల్లో జలవిలయం ముప్పు పొంచి ఉండటంతో.. డ్యామ్‌ కింద ఉన్న పది గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి..ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశామని.. […]

ఏపీటీఎస్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS)లో 6 జిల్లాలకు గాను జిల్లా ఐటీ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బీటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఎంబీఏ చదివిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపింది. అలాగే సంబంధిత పోస్టుకు సంబంధించి 3ఏళ్లు అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 01-07-2025 నాటికి 18 నుంచి 42 ఏళ్ల […]

చాట్‌జీపీటీయే మా కొడుకు చావుకు కారణం.. ఓపెన్‌ఏఐపై తల్లిదండ్రులు సంచలన దావా

చాట్‌జీపీటీ కారణంగానే తమ 16 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఆరోపిస్తూ.. ఓపెన్ఏఐ , ఆ సంస్థ సీఈఓ సామ్ ఆల్తమస్‌పై తల్లిదండ్రులు దావా వేయడం సంచలనంగా మారింది. తమ కుమారుడు ఆడమ్ రైన్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు చాట్‌జీపీటీలో ఆత్మహత్య గురించి సెర్చ్ చేశాడని ‘చాట్‌బాట్ ఆడమ్ ఆత్మహత్య ఆలోచనలను ధ్రువీకరించడమే కాకుండా ప్రాణాంతక పద్ధతులపై నిర్దిష్ట వివరాలను అందించింది.. తల్లిదండ్రుల క్యాబిన్ నుంచి మద్యం ఎలా పొందాలో అతడికి సూచించింది.. సూసైడ్ […]

తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ …

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ అసాధారణ వర్షపాతం ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం తీవ్ర విపత్తుగా మారింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మిల్లీమీటర్లు కురిసింది. అంటే కేవలం 14 గంటల్లోనే 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షం కాదని.. విపత్తు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON