loader

ఏపీ సముద్ర తీరానికి కోట్ల పెట్టుబడితో కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్యంలో భారీ అడుగు వేసింది. తూర్పు తీరాన్ని దేశానికి ప్రధాన మారిటైమ్ గేట్‌వేగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు పడింది.ప్రపంచ ప్రఖ్యాత మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంతో రాష్ట్రానికి రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి రానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇది పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయనుంది

ఏపీ కేబినెట్ మీట్: మొత్తం 33 అంశాలకు ఆమోదం

అమరావతిలో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 51వ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) సమావేశ ప్రతిపాదనలకు, అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అదనంగా, 993 కొత్త పోస్టుల మంజూరు కూడా […]

కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన RPF అధికారి!

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి ఒకరు లగేజీతో రైలెక్కిన ఓ ప్రయాణికుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి బలవంతంగా బయటకు నెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సదరు అధికారి ఓ యువకుడిని చెంపదెబ్బలు కొడుతూ, కదులుతున్న రైలు డోర్‌ నుంచి బలవంతంగా తోస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రయాణికులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సదరు RPF అధికారిపై రైల్వే మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు […]

టీవీకే మహానాడులో స్పృహ‌త‌ప్పి పడిపోయిన 400 మంది.. 12 మంది పరిస్థితి విషమం

మదురైలో గురువారం (ఆగస్టు 21న) నిర్వహించిన తమిళగ వెట్రి కళగం రెండో మహానాడు భబహిరంగ సభలో రద్దీ ఏర్పడి.. తోపులాట జరిగింది,400 మంది అభిమానులు, కార్యకర్తలు స్పృహ‌త‌ప్పి పడిపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అంతకు ముందు విజయ్‌ జెండా ఎగురవేసేలా 100 అడుగుల పోల్‌ను ఏర్పాటు చేస్తుండగా విరిగి కారుపై పడింది… అందులో ఉన్న […]

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అదిరిపోయే గ్లింప్స్

చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ ని తీసుకువచ్చారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. గతంలో విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానిని చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. లేటెస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.

మల్లన్నసాగర్ ముంపు బాధితుడిపై అధికారుల దౌర్జన్యం.. ఫ్యామిలీ మొత్తం మిస్సింగ్!

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు బాధితుడు రామచంద్రం అనే వ్యక్తిని రెవెన్యూ, పోలీసులు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. ఖాళీ చేయిస్తున్న సమయంలో రామచంద్రం కుటుంబ సభ్యులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.కుటుంబ సభ్యులు అధికారుల కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. పోలీసులు వారిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించి మరో వ్యక్తికి ఆ ఇంటిని కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన రామచంద్రం కుటుంబం నిన్నటి నుంచి […]

సింహం సింగిల్‌గానే వస్తుంది.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది మనమే.. మధురై సభలో టీవీకే విజయ్

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ కలవదని, బీజేపీతో కలుస్తుందనే అపోహలను ఆయన ఖండించారు.టీవీకే ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇది ప్రజల పార్టీ అని విజయ్ నొక్కిచెప్పారు. తన పార్ట ఎన్నికలకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, వారి మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ […]

ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు… అయితే గందరగోళం మధ్యే ఇది ఆమోదం పొందింది. అమాయక ప్రజలకు డబ్బులు ఆశచూపే ఆన్లైన్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించడమే కాదు మంచి ఆన్లైన్ గేమ్స్ ను ప్రోత్సహించేలా ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఇక అమల్లోకి […]

ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టండి.. అధికారులకు పవన్ కళ్యాణ్

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని.. సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా.. కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చి చెప్పారు.

ఇండియాను ప్ర‌జాస్వామ్య భాగ‌స్వామిగా భావించాలి : నిక్కీ హేలీ

అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు, ఐక్యరాజ్యసమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ, అమెరికా మునుపటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై స్పందించారు. భార‌త్‌తో వాణిజ్య సంబంధాల‌ను మెరుగుప‌రుచుకోవాల‌ని అమెరికా రిప‌బ్లిక‌న్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో ట్రంప్ స‌ర్కారు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంద‌ని ఆమె అన్నారు. చైనాను అధిగ‌మించే ఉద్దేశంలో.. భార‌త్‌తో వాణిజ్య రిలేష‌న్‌ను దెబ్బ‌తీసుకోవ‌ద్దు అని ఆమె సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON